US: ఒమిక్రాన్ వేళ.. అక్కడ5 ఏళ్లలోపు పిల్లల్లో భారీగా ఆసుపత్రి చేరికలు..!
అగ్రదేశం అమెరికాలో కరోనావైరస్ ఉద్ధృతి చూపిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజా విజృంభణకు దోహదం చేస్తోంది.
వాషింగ్టన్: అగ్రదేశం అమెరికాలో కరోనావైరస్ ఉద్ధృతి చూపిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజా విజృంభణకు దోహదం చేస్తోంది. నిత్యం లక్షల్లోనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే మహమ్మారి అడుగుపెట్టిన దగ్గరి నుంచి ఎన్నడూ లేని విధంగా ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సువారిలో ఆ సంఖ్య ఇటీవల వారాల్లో భారీగా పెరిగిందని శుక్రవారం ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
డిసెంబర్ ప్రారంభం నుంచి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి లక్ష మందిలో నలుగురు కంటే ఎక్కువ మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి వస్తోంది. అదే 5 నుంచి 17 ఏళ్ల చిన్నారుల విషయంలో ఆ సంఖ్య ఒకటిగానే ఉందని గణాంకాలు పేర్కొన్నాయి.
మిగిలిన వయస్సువారితో పోల్చుకుంటే చిన్నారుల్లో ఆసుపత్రి చేరిక తక్కువగానే ఉందని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రాచెల్లె వాలెన్స్కీ వెల్లడించారు. అయితే మహమ్మారి ప్రారంభమైన దగ్గరి నుంచి పిల్లలు ఆసుపత్రుల్లో చేరుతున్న రేటు మాత్రం ఇప్పుడే అత్యధికమని వెల్లడించారు. 12 నుంచి 18 ఏళ్ల వయస్సు వారిలో 50 శాతం కంటే ఎక్కువ మంది మాత్రమే టీకా తీసుకున్నారని, 5 నుంచి 11 ఏళ్ల వయస్సు వారిలో అది 16 శాతంగానే ఉందన్నారు. చిన్నారులు, టీనేజర్లలో మంగళవారం వరకు సగటున రోజుకు 766 మంది ఆసుపత్రుల్లో చేరారు. రెండు వారాల క్రితంతో పోల్చుకుంటే అది రెట్టింపు సంఖ్య.
ఊబకాయం, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలున్న పిల్లల్లో ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంటోందని ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అన్నారు. చిన్నారుల్ని రక్షించుకునేందుకు అంతా టీకా తీసుకోవడమే ఉత్తమమైన మార్గమని వెల్లడించారు. వాలెన్స్కీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోపక్క సీడీసీ 12 ఏళ్ల వయస్సువారికి కూడా బూస్టర్లను సిఫారసు చేసింది. పెద్దవయస్సు వారిలో 34 శాతం మంది బూస్టర్లు తీసుకున్నారు. కొత్త సంవత్సరంలో 5 ఏళ్ల లోపు పిల్లలకు టీకా అందుబాటులోకి వస్తుందని అక్కడి తల్లిదండ్రులు ఆశించారు. ఆ వయస్సు వారికి ఇప్పటికే టీకా అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఫైజర్ టీకా అందుబాటులోకి వస్తుందని భావించినప్పటికీ.. రెండు డోసుల టీకా ఆశించినంత రక్షణ ఇవ్వడం లేదని సంస్థ గత నెల ప్రకటించి, వెనక్కి తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు