Economic Crisis: ‘భారత్ మమ్మల్ని రక్షించింది.. రక్తపాతాన్ని నివారించింది..!’
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో భారత్ తమను రక్షించిందని శ్రీలంక పార్లమెంటు స్పీకర్ అబేయవర్ధేన గుర్తుచేసుకున్నారు. లేనిపక్షంలో దేశంలో మరో రక్తపాతం జరిగి ఉండేదన్నారు.
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభం (Economic Crisis)తో గతేడాది శ్రీలంక (Sri Lanka) అతలాకుతలమైన విషయం తెలిసిందే. నిత్యవసర వస్తువులతోపాటు గ్యాస్, డీజిల్, పెట్రోల్, ఔషధాల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజల జీవనం కష్టతరమైంది. దీంతో విసుగెత్తిపోయిన జనాలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించింది. దాదాపు 4 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక తోడ్పాటుతోపాటు ఔషధ సామగ్రి తదితర రూపాల్లో సాయం అందించింది. ఇదే విషయాన్ని శ్రీలంక పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబేయవర్ధేన (Abeywardena) తాజాగా గుర్తుచేసుకున్నారు. కష్టకాలంలో భారత్ తమకు అండగా నిలిచిందని.. లేనిపక్షంలో దేశంలో మరో రక్తపాతం జరిగి ఉండేదన్నారు. భారత్ను విశ్వసనీయ మిత్రదేశంగా అభివర్ణించారు.
భారతీయ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలంబోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అబేయవర్ధేన మాట్లాడుతూ.. ‘ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు భారత్ దన్నుగా నిలిచింది. సంక్షోభం మధ్యలో ఆరు నెలలపాటు మనుగడ సాగించడానికి ఇది తోడ్పడింది. ఇప్పుడు కూడా.. రుణాల పునర్వ్యవస్థీకరణను 12 ఏళ్లపాటు పొడిగించేందుకు సిద్ధంగా ఉందని విన్నాను. ఇది ఊహించలేదు. భారత్ చేసిన విధంగా శ్రీలంకకు ఏ దేశం కూడా సాయం చేయలేదు. ఈ రెండు దేశాల మధ్య నాగరికత, సంస్కృతుల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. మేం ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి ఆదుకుంది. ఈ విషయంలో భారత్కు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని అన్నారు. శ్రీలంకకు భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే, శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరీన్ ఫెర్నాండో తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా.. విదేశీ మారక నిల్వల కొరత కారణంగా 2022లో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురైంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. ఈ పరిస్థితులకు అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కారణమంటూ నిరసనలు చేపట్టారు. ఈ పరిణామాల నడుమ గత మే నెలలో మహింద రాజపక్స ప్రధాని పదవికి బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు అధ్యక్షుడిగా ఉన్న ఆయన సోదరుడు గొటబాయ దేశం విడిచి పారిపోయారు. గత రెండు దశాబ్దాలుగా శ్రీలంక రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించిన రాజపక్స కుటుంబాన్ని అధికారం నుంచి తొలగించడానికి ఈ సంక్షోభం కారణమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి