Pak Economic Crisis: దాయాది దేశం.. మరో శ్రీలంక కానుందా..?
టీ వినియోగాన్ని తగ్గించండని మంత్రి వ్యాఖ్యలు.. రాత్రి పది దాటిన తర్వాత వివాహ వేడుకలపై నిషేధం.. కాగితం కొరత.. విద్యుత్ టారిఫ్లను పెంచడం.. పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను విధింపు.. ఇవన్నీ ప్రస్తుతం పాకిస్థాన్లో నెలకొన్న పరిస్థితులు. నిధుల కొరతతో సతమతమవుతోన్న దాయాది దేశం ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇస్లామాబాద్: టీ వినియోగాన్ని తగ్గించండని మంత్రి వ్యాఖ్యలు.. రాత్రి పది దాటిన తర్వాత వివాహ వేడుకలపై నిషేధం.. కాగితం కొరత.. విద్యుత్ టారిఫ్లను పెంచడం.. పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను విధింపు.. ఇవన్నీ ప్రస్తుతం పాకిస్థాన్లో నెలకొన్న పరిస్థితులు. నిధుల కొరతతో సతమతమవుతోన్న దాయాది దేశం ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పన్నుల ద్వారా రాబడులు పెంచుకోవాలని చూస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే.. ఇది మరొక శ్రీలంక కానుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
టీ తగ్గించండి.. ‘టీ తాగడం 1-2 కప్పులు తగ్గించండి. విదేశీ మారక నిధులు తగ్గిపోతున్న సమయంలో ఈ చర్య వల్ల దిగుమతి భారం కాస్త తగ్గుతుంది’ అంటూ పాకిస్థాన్కు ఆ దేశ ప్రణాళిక శాఖ మంత్రి పిలుపునిచ్చారు. దీనిపై తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. ‘మాపై పన్నులు విధిస్తారు. మా టీ కప్పు లాక్కుంటారు. వారు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టరు’ అంటూ పాక్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగితం సంక్షోభం: ప్రస్తుతం పాక్ కాగితం కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీనివల్ల ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి పుస్తకాలు అందుబాటులో ఉండవని ఆ దేశ పేపర్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దిగుమతి చేసుకుంటోన్న కాగితంపై భారీగా పన్నులు విధించడం, స్థానిక కాగితపు పరిశ్రమల గుత్తాధిపత్యం ఈ పరిస్థితికి దారితీస్తోంది. ఇది పేద, మధ్య తరగతి విద్యార్థుల కుటుంబాలకు భారం కానుంది. పుస్తకాల కొనుగోలు కోసం విద్యాసంస్థలు వారి నుంచి ఎక్కువ మొత్తం గుంజే అవకాశం ఉంది.
రాత్రుళ్లు వివాహ వేడుకలు బంద్: విద్యుత్ ఖర్చును తగ్గించుకునే లక్ష్యంతో ఈ నెల షరీఫ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రాత్రి పది దాటిన తర్వాత రాజధాని ఇస్లామాబాద్లో వివాహ వేడుకలు నిర్వహించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చేందుకు సిద్ధమైంది.
ముందుచూపు లేని నిర్ణయాలే కారణమా..?
అంతర్జాతీయ వ్యవహారాలను చూసే ICWA నివేదిక ప్రకారం.. పాక్ ప్రభుత్వాధినేతలు ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయాలే ఈ పరిస్థితులకు కారణమయ్యాయి. అభివృద్ధికి దూరంగా, లాభదాయకంగా లేని ప్రాజెక్టులపై చేసిన ఖర్చు ప్రస్తుత పరిస్థితికి దోహదం చేశాయంది. యూఎస్ డాలర్తో పోలిస్తే పాకిస్థానీ రూపాయి స్థిరంగా పతనం కావడం, అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్ పరంగా అధమ స్థానంలో నిలవడం, మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) లో గ్రే లిస్టింగ్..ఇవన్నీ విదేశీ పెట్టుబడిదారులను దూరం చేశాయి. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)ని ప్రారంభించడం వల్ల బాహ్య రుణాలు భారీగా పెరిగాయని తెలిపింది. ఈ చెల్లింపుల సమస్యను ఎదుర్కొనేందుకు పాక్.. ఐఎంఎఫ్ను సంప్రదించింది.
ఈ క్రమంలో 6 బిలియన్ డాలర్ల రెస్క్యూ ప్యాకేజీని తిరిగి ప్రారంభించడానికి ఐఎంఎఫ్(IMF) పాకిస్థాన్కు కొన్ని ముందస్తు షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా విద్యుత్ టారిఫ్లను పెంచడం, పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు విధించడం, ప్రభుత్వ శాఖల్లో అక్రమార్జనను అరికట్టేందుకు కట్టుదిట్ట చర్యలను చేపట్టాలని సూచించినట్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై పాక్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో జూన్ 22న ఐఎంఎఫ్తో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం