Iguana Island: అమ్మకానికి ఐలండ్.. ధరెంతో తెలుసా?
ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ కొనే ధరకే ఓ ద్వీపాన్ని సొంతం చేసుకోవచ్చని తెలుసా..? ఎక్కడనేగా మీ సందేహం? భారత్లో మాత్రం కాదు.
ఇంటర్నెట్ డెస్క్: సొంతిల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ, పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్నంటుతున్న భూముల ధరలతో చాలా మంది మధ్య తరగతి వారికి సొంతిల్లు ఒక కలగానే మిగిలిపోతుంది. మరోవైపు సంపన్న వర్గాలు తమ అభిరుచికి తగినట్లుగా విలాసవంతమైన ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటారు. అలాంటి వారికి కూడా ముంబయి వంటి మహానగరంలో కోట్లు కుమ్మరించినా.. అపార్ట్మెంట్ మించి కొనలేని పరిస్థితి. అక్కడ ధరలు ఓ రేంజ్లో ఉంటాయి మరి. అయితే, ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ కొనే ధరకే ఓ ద్వీపాన్ని (Island) సొంతం చేసుకోవచ్చని తెలుసా? ఎక్కడనేగా మీ సందేహం? భారత్లో మాత్రం కాదు.
ఈ ద్వీపం మధ్య అమెరికాలోని నికరాగువా (Nicaragua) దేశంలో బ్లూఫీల్డ్స్ అనే ప్రాంతం నుంచి 19.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని పేరు ఇగువానా ఐలండ్ (Iguana Island). సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలో కొబ్బరి, అరటి చెట్ల మధ్య మూడు గదుల విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇందులో హాల్, కిచెన్, బార్, లివింగ్ ఏరియాతోపాటు పనివారి కోసం ప్రత్యేకంగా కొన్ని గదులు కూడా ఉన్నాయి. ఇంటి బయట స్విమ్మింగ్ పూల్, ఫిష్ డాక్ను నిర్మించారు. ద్వీపానికి చుట్టూ ఉన్న ప్రకృతి ఆందాలను చూసేందుకు 28 అడుగుల వాచ్ టవర్ కూడా ఉంది. వైఫై, టీవీ, ఫోన్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
ఈ ద్వీపాన్ని సొంతం చేసుకోవాలనుకునేవారు ప్రైవేట్ ఐలండ్ ఆన్లైన్ అనే వెబ్సైట్లోకి వెళ్లి నికరాగువా ప్రాంతంపై క్లిక్ చేస్తే ఇగువానా ఐలండ్ వివరాలు కనిపిస్తాయి. వెబ్సైట్ ప్రకారం ఈ ద్వీపం ధర 475 వేల డాలర్లు. భారత కరెన్సీలో సుమారు ₹3.87 కోట్లు. ప్రస్తుతం ఈ ద్వీపాన్ని ఇంకా ఎవరూ కొనుగోలు చేయలేదు. ఆన్లైన్ వేలంలో పాల్గొని సొంతం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు