Israel: హమాస్ చెరలో బందీలు.. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వద్ద కుటుంబసభ్యుల ఆందోళన
హమాస్ చెరలో బందీలుగా ఉన్న వాళ్లను వెంటనే విడిపించి తీసుకురావాలని వారి కుటుంబసభ్యులు ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే వారంతా భారీ ర్యాలీ నిర్వహించారు.
జెరూసలెం: హమాస్(Hamad) అంతం.. వారి వద్ద బందీలుగా(Hostages) ఉన్న వారిని క్షేమంగా తీసుకురావడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) గాజా (Gaza)పై భీకర దాడులకు పాల్పడుతోంది. ఆ ప్రాంతాన్ని నలువైపులా చుట్టుముట్టినా.. బందీలను కనుగొనడంలో మాత్రం విఫలమవుతోంది. ఆరు వారాలు గడిచినా హమాస్ చెరలోని బందీల ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. తమవారిని సురక్షితంగా విడిపించి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మద్దతుదారులతో కలిసి నాలుగు రోజుల భారీ ర్యాలీ చేపట్టారు. దాదాపు 30 వేల మంది 60కి.మీ మేర పాదయాత్ర చేసుకుంటూ శనివారం దేశ రాజధానికి చేరుకొని, ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. హమాస్ ఉగ్రమూకలు అపహరించిన వారి ఫొటోలను ప్రదర్శిస్తూ ‘‘మావాళ్లను వెంటనే తీసుకురండి’’ అంటూ నినాదాలు చేశారు. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ప్రధాని కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని, అవసరమైతే తామంతా పాదయాత్రగా గాజాకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు బందీల కుటుంబసభ్యులు తెలిపారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా చేసుకున్నారు.
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫా సమీపంలో గురువారం ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించింది. మృతురాలు హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారిలో ఒకరని ప్రకటించిన ఐడీఎఫ్ మృతదేహాన్ని మరణానంతర పరీక్షలకు పంపించింది. అనంతరం ఆస్పత్రిలో నిర్వహించిన తనిఖీల్లో ఒక ల్యాప్టాప్ లభించిందని, అందులో బందీలుగా ఉన్న వారి ఫొటోలు, వీడియోలు ఉన్నాయని సైన్యం పేర్కొంది. అంతకుముందు ఆస్పత్రి ఐసీయూ విభాగంలో హమాస్కు చెందిన ఆయుధాలను ఐడీఎఫ్ గుర్తించిన విషయం తెలిసిందే.
ఖాళీ అవుతోన్న ‘అల్-షిఫా’.. వందలాది పౌరులు బయటకు
తాజాగా ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై కూడా దాడి చేస్తోంది. శనివారం జరిపిన దాడుల్లో దాదాపు 32 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. దక్షిణ ప్రాంతంలో దాడులను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించిన ఇజ్రాయెల్ సైన్యం.. ఆ ప్రాంతంలోని పాలస్తీనీయులు వెంటనే పశ్చిమ ప్రాంతం వైపు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఖాన్ యూనిస్ పట్టణంలో నివసిస్తున్న దాదాపు 4 లక్షల మంది ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!