‘ఆ పసి హృదయం దారుణంగా గాయపడింది’: బైడెన్
Israel-Hamas Conflict: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన సంధి నేటితో ముగియనుంది. దీనిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్: ఇజ్రాయెల్-హమాస్(Israel-Hamas) మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో గత మూడు రోజులు రెండువర్గాలు తమ చెరలో ఉన్న బందీలను విడుదల చేశాయి. నేటి(సోమవారం)తో నాలుగు రోజుల సంధి గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఈ ఒప్పందం పొడిగింపునకు అనుకూలంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలు చేశారు. దానివల్ల మరింతమంది బందీలు విడుదలయ్యే వీలు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. (Israel-Hamas Conflict)
అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందంతో హమాస్ 58 మందిని విడిచిపెట్టగా.. ఇజ్రాయెల్ 114 మందికి విముక్తి కల్పించింది. వీరిలో నాలుగేళ్ల అమెరికా బాలిక కూడా ఉంది. ‘ఈ డీల్ ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది. గాజాకు అత్యంత అవసరమైన మానవతా సాయం అందుతోంది. ఈ ఫలితాలను ఇలాగే పొందేందుకు దీనిని పొడిగించవచ్చు. అదే నా లక్ష్యం. మనందరి లక్ష్యం అదే’ అని బైడెన్ అన్నారు. అలాగే ఆ పసి హృదయం దారుణంగా గాయపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఆ బాలిక తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టాం
మరోపక్క హమాస్ కూడా ఈ ఒప్పందం పొడిగింపును కోరుకుంటోంది. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ సీరియస్గా ఉంటే.. ఈ డీల్ను పొడిగించొచ్చని హమాస్ తన ప్రకటనలో పేర్కొంది.
నెతన్యాహుతో భేటీ కానున్న మస్క్..!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడితోనూ సమావేశం కానున్నారు. ఇజ్రాయెల్ వర్గాలు ఈ భేటీని ధ్రువీకరించగా.. మస్క్ ప్రతినిధుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. తన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్(ట్విటర్)లో యూదు వ్యతిరేక విద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ మస్క్పై పౌర సంఘాలు ఆరోపణలు చేశాయి. ఈ క్రమంలోనే ఈ భేటీ వార్తలు రావడం గమనార్హం.
గాజా కరవు అంచున ఉంది: ఐరాస
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఘర్షణతో గాజా నగర ప్రజల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. ఈ దాడులతో గాజా నగరం కరవు అంచున కొట్టుమిట్టాడుతోందని ఐరాస అనుబంధ సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం హెచ్చరించింది. ఆ నగరానికి మానవతా సాయాన్ని మరింత పెంచాలని ప్రపంచ దేశాలను కోరింది. ఈ కరవు వల్ల వ్యాధులు వ్యాప్తి చెందొచ్చని, ఇతర విపత్కర పరిస్థితులు ఎదురుకావొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే నాలుగు రోజుల కాల్పులు విరమణతో గాజాకు అందుతోన్న సాయం కాస్త పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎట్టిపరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక
Sri Lanka: బాధ్యతాయుత పొరుగుదేశంగా భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను అనుమతించబోమని శ్రీలంక స్పష్టం చేసింది. గత ఏడాది చైనా గూఢచార నౌక ఒకటి శ్రీలంక తీరంలో ఆగడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. అయితే, ఈ సందర్భంగా ఆయనపై ఉన్న ఆరోపణలను గుర్తుచేసింది. -
అదే డేంజర్ బెల్!
ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగున్నర దశాబ్దాల నాటి హెలికాప్టర్. మరమ్మతులు, నిర్వహణకు సరైన విడిభాగాలు లేవు. ఇదేదో సరకు రవాణాకు ఉపయోగించే లోహవిహంగం కాదు.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పయనిస్తున్న హెలికాప్టర్. -
మతబోధకుడి స్థాయి నుంచి అధ్యక్ష పీఠం వరకు
ఇబ్రహీం రైసీ.. ప్రస్తుత ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకే కాదు.. అంతకుముందు అధినేతగా ఉన్న ఖొమైనీకీ సన్నిహితుడే. ఈ ఇద్దరి అధినేతల అండతోనే మతబోధకుడిగా ప్రస్థానం ప్రారంభించిన రైసీ అధ్యక్ష స్థానం వరకు ఎదిగారు. రైసీ సంస్కరణ వాది కాదు.. కరడుగట్టిన సంప్రదాయ వాది. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ ఇవ్వండి
ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా హమాస్, ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్ సోమవారం కీలక అభ్యర్థనలు చేశారు. -
శ్రీలంక ఆలయంలో సరయు నదీ జలాలతో కుంభాభిషేకం
శ్రీలంకలోని సీతా అమ్మన్ ఆలయానికి ఆదివారం నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీలంక, భారత్, నేపాల్కు చెందిన వేల మంది భక్తులు పాల్గొన్నట్లు భారత హైకమిషన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. -
అసాంజేకు భారీ ఊరట
గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు సోమవారం లండన్ న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. -
‘కలుషిత రక్తం’ కుంభకోణంపై రిషి సునాక్ క్షమాపణలు
బ్రిటన్లో 1970ల్లో చోటుచేసుకున్న కలుషిత రక్తం కుంభకోణాన్ని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) కప్పిపుచ్చినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రధానమంత్రి రిషి సునాక్ సోమవారం క్షమాపణలు తెలిపారు. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. తక్షణం రంగంలోకి దిగిన ‘ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ’ ఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం గుర్తించింది. -
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసినా.. అనేక మందితో లైంగిక కార్యకలాపాలు కొనసాగించిన ఓ సెక్స్ వర్కర్ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.