Pakistan: మత మార్పిడికి ‘నో’.. పాకిస్థాన్లో హిందూ మహిళపై ఘోరం
మత మార్పిడికి అంగీకరించని హిందూ మహిళపై దారుణం జరిగింది. కిడ్నాప్ చేసిన కిరాతకులు ఆమెపై మూడు రోజుల పాటు అత్యాచారం చేశారు.
కరాచీ: పాకిస్థాన్(Pakistan)లో హిందువులపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సింధ్ ప్రావిన్స్లో ఓ వివాహిత మహిళపై కొందరు వ్యక్తులు కిరాతకానికి ఒడిగట్టారు. మతం మారాలని బలవంతం చేయగా అందుకు ఆమె నిరాకరించడంతో కిడ్నాప్(Kidnapping) చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. ఉమర్కోట్ జిల్లాలోని సమరో పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. మహిళ తనపై కొందరు వ్యక్తులు కిరాతకానికి ఒడిగట్టారని చెప్పినా ఆదివారం వరకు మిర్పుర్ఖాస్ పోలీసులు కేసు నమోదు చేయడంలో విఫలమయ్యారని స్థానిక హిందూ నేత ఒకరు విమర్శించారు. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్ బయటే కూర్చొన్నా కేసు నమోదు చేయడంలేదన్నారు.
మరోవైపు, తనను ఇస్లాంలోకి మారాలంటూ ఇబ్రహీం మాంగ్రియో, పున్హో మాంగ్రియో, వారి సహచరులు బెదిరించారని.. ఒప్పుకోకపోయే సరికి కిడ్నాప్ చేసి మూడు రోజుల పాటు అత్యాచారం చేసినట్టు బాధితురాలు వాపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కిడ్నాపర్ల నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకోగలిగానని పేర్కొన్నారు.
సింధ్ ప్రావిన్స్లోని శివారు ప్రాంతాల్లో హిందూ యువతులు, మహిళల్ని కిడ్నాప్లు చేయడం, బలవంతంగా మతమార్పిడలకు పాల్పడటం పెద్ద సమస్యగా మారింది. హిందువులు అత్యధికంగా ఉండే ప్రాంతాలైన థార్, ఉమర్కోట్, మిర్పుర్ఖాస్, ఘోట్కి, ఖైరాపూర్ వంటి చోట్ల ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతేడాది జూన్లో తనను బలవంతంగా ఇస్లాం మతానికి మార్చి ఓ ముస్లిం పెళ్లి చేసుకున్నాడంటూ కరీనా కుమారి అనే బాలిక కోర్టుకు చెప్పింది. అలాగే, గతేడాది మార్చిలో ముగ్గురు హిందూ బాలికలు సత్రన్ ఓద్, కవితా భీల్, అనిత భీల్లను కిడ్నాప్ చేసి బలవంతంగా మతమార్పిడి చేయించారు. ఆ తర్వాత ఎనిమిది రోజుల్లోనే ముస్లిం పురుషులతో వారికి పెళ్లి చేయించిన ఉదంతం చోటుచేసుకుంది. అదే నెలలో పూజా కుమారి అనే యువతి ఓ పాకిస్థానీని పెళ్లి చేసుకొనేందుకు నిరాకరించడంతో సుక్కుర్లోని రోహ్రీలో ఆమె ఇంటి వద్దే తుపాకీతో దారుణంగా కాల్చి చంపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం