USA: అధ్యక్ష బరి నుంచి వైదొలిగిన అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు

వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి మైక్‌ పెన్స్‌ వైదొలిగారు. ఈ విషయాన్ని రిపబ్లికన్‌ జెవిష్‌ కొయిలేషన్‌ వార్షిక సదస్సులో ఆయనే స్వయంగా ప్రకటించారు. 

Published : 29 Oct 2023 06:50 IST

వాషింగ్టన్‌: అమెరికాలో వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్‌ నేత మైక్‌ పెన్స్‌ ప్రకటించారు. లాస్‌ వేగాస్‌లో జరిగిన రిపబ్లికన్‌ జెవిష్‌ కొయిలేషన్‌ వార్షిక సదస్సులో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘అనేక చర్చల తర్వాత అధ్యక్ష బరి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా ప్రచార కార్యక్రమాలను మాత్రమే వీడుతున్నాను. సంప్రదాయ విలువలకు కట్టుబడి రిపబ్లికన్‌ నేతలకు మద్దతుగా ఉంటా. వారి విజయాల కోసం కృషి చేస్తానని మాటిస్తున్నా’’అని పెన్స్‌ తెలిపారు.

ఆర్థిక సవాళ్లు, పార్టీ పోలింగ్‌లో వెనుకబడటంతో పెన్స్‌ అధ్యక్ష బరి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ట్రంప్‌ హయాంలో పెన్స్‌ దేశ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతకుముందు ఇండియానా గవర్నర్‌గా, యూఎస్‌ కాంగ్రెస్‌సభ్యుడిగా దేశానికి సేవ చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌, నిక్కీ హేలీ, వివేక్‌ రామస్వామి, ర్యాన్‌ బింక్లీ, టిమ్‌ స్కాట్‌ తదితరులు పోటీపడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని