Pakistan: నిండుకున్న విదేశీ మారక నిల్వలు.. పతనం అంచున పాకిస్థాన్..!
పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారుతోంది. అక్కడి సెంట్రల్ బ్యాంకులో విదేశీ మారక నిల్వలు ఎనిమిదేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. విదేశీ దిగుమతుల కోసం ఇవి మూడు వారాలకు మాత్రమే సరిపోతాయని అక్కడి మీడియా వెల్లడించింది.
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్(Pakistan)లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రజలకు నిత్యావసరాలు అందించలేని దుస్థితిలో ఉన్న దాయాది దేశంలో విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves) వేగంగా క్షీణిస్తున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంకులో ఇవి ఎనిమిదేళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు తెలిపింది. ఆర్థిక వ్యవస్థ (Economy) పతనం అంచుకు చేరుకుందనే భయాలు నెలకొన్న వేళ.. తాజా పరిస్థితులు పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఉద్యోగుల జీతాలు, పౌరులకు అందించే సబ్సిడీ పథకాల్లో కోత, విద్యుత్ వినియోగంపై వంటి ఆంక్షలను కొంతకాలంగా అమలు చేస్తోంది. అయినా.. పరిస్థితులు కుదుటపడకపోగా.. రోజురోజుకు క్షీణిస్తున్నాయి! డిసెంబర్ 30, 2022 నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ (SBP) మారక నిల్వలు 5.5 బిలియన్ అమెరికన్ డాలర్లకు పడిపోయినట్లు పాక్ వార్తాపత్రిక ‘ది డాన్’ వెల్లడించింది. చివరి వారంలో కేవలం రుణాల చెల్లింపులకే 245 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు అంచనా.
గతేడాది(2022) జనవరిలో పాకిస్థాన్ విదేశీమారక నిల్వలు 16.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాది చివరి నాటికి వచ్చేసరికి 11 బిలియన్ డాలర్లు క్షీణించి 5.6 బి.డాలర్లకు పడిపోయింది. ఇవి మూడు వారాల దిగుమతులకు మాత్రమే సరిపోతాయని అంచనా. వాణిజ్య బ్యాంకులతో కలిపి మొత్తంగా దేశంలో విదేశీ మారక నిల్వలు సుమారు 11.4 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా భారీస్థాయిలో మారక నిల్వలు తరిగిపోతుండటంతో అమెరికన్ డాలర్తోపాటు ఇతర కరెన్సీలతో పాకిస్థాన్ కరెన్సీ విలువ కూడా పతనమవుతోంది. ఇదే సమయంలో మిత్రదేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి ఆశించిన మేర సాయం అందకపోవడంతో విదేశీ రుణాలు చెల్లించేందుకు దాయాది దేశానికి కష్టంగా మారింది.
దివాలా అంచుకు చేరుకున్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకుగానూ అంతర్జాతీయ సంస్థలు, విదేశీ రుణాల కోసం పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఇప్పటివరకు వాటి నుంచి ఆశించినంత సాయం అందలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో మరిన్ని రుణాలు కోసం ప్రయత్నిస్తోన్న పాక్కు.. విదేశీ బ్యాంకులు భారీగా అపరాధ రుసుం వేస్తున్నట్లు సమాచారం. డాలరుతో పోలిస్తే ప్రస్తుతం పాక్ రూపాయి విలువ రూ.228కి పడిపోయినట్లు అక్కడి సెంట్రల్ బ్యాంక్(ఎస్బీపీ) పేర్కొంది. ఎస్బీపీ వద్ద విదేశీ మారక నిల్వలు అట్టడుగుస్థాయికి చేరుకుంటున్న తరుణంలో విదేశీ సంస్థలు.. ఆర్థిక సాయం అందిస్తాయని పాకిస్థాన్ ఆర్థికశాఖ మంత్రి ఇషాక్ దార్ కొంతకాలంగా ఆశాభావం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ పాక్ ఆర్థిక పరిస్థితి మాత్రం పతనం అంచుకు చేరుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్