Pakistan: సంక్షోభంలో పాకిస్థాన్.. నాలుగేళ్లలో ఐదో ఆర్థికమంత్రి రాజీనామా
పాకిస్థాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
లండన్: గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ (Pakistan) ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం మొదలు ఇటీవల భారీ వరదల వంటి వరస సవాళ్లతో (Economic Crisis) ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో ఆ దేశ ఆర్థికశాఖ మంత్రులు ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేకపోతున్నారు. తాజాగా ఆ దేశ ఆర్థిక మంత్రి (Finance Minister) ఇస్మాయిల్ కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఇలా గడిచిన నాలుగేళ్లలోపే ఐదో ఆర్థిక మంత్రి ఆ పదవిని వీడనున్నారు. మరోవైపు విదేశీ పర్యటనలో ఉండగానే పాకిస్థాన్ ఆర్థికమంత్రి ఇస్మాయిల్ రాజీనామా ప్రకటించడం గమనార్హం.
‘ఆర్థిక మంత్రిగా మౌఖికంగా ఇప్పటికే రాజీనామా చేశాను. ప్రధాని షెహబాజ్ షరీఫ్, మాజీ పీఎం నవాజ్ షరీఫ్లతో జరిగిన సమావేశంలో నా నిర్ణయాన్ని వెల్లడించాను. పాకిస్థాన్కు చేరుకున్న వెంటనే లిఖితపూర్వకంగా రాజీనామా చేస్తాను’ అని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ (Miftah Ismail) ప్రకటించారు. అయితే, ఇటీవల ఇంధన ధరల పెంపుతో పాటు పలు కీలక అంశాలపై ఇస్మాయిల్ తీసుకున్న నిర్ణయాలపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇస్మాయిల్ రాజీనామా ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లండన్లో ఉన్న ప్రధాని షరీఫ్, ఆర్థికమంత్రి ఇస్మాయిల్లు వచ్చేవారం పాకిస్థాన్కు చేరుకోనున్నారు.
గత కొంతకాలంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, తరిగిపోతోన్న విదేశీ మారక నిల్వలతో పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వీటికితోడు ఇటీవల అక్కడ సంభవించిన భారీ వరదల్లో 1500 మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా సుమారు రూ.2లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇలా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రులు ప్రయత్నిస్తున్నప్పటికీ సఫలం కావడం లేదు. దీంతో ఏడాది కాకుండానే దేశ ఆర్థికమంత్రులు తమ పదవులను వీడుతున్నారు. ఇలా గడిచిన నాలుగేళ్లలోపే నలుగురు ఆర్థికమంత్రులు మారిపోయారు. ప్రస్తుతం ఇస్మాయిల్ కూడా రాజీనామాను ప్రకటించడంలో ఐదో వ్యక్తిగా నిలిచారు. ఈయన స్థానంలో పీఎంఎల్-ఎన్ నేత ఇషాక్ దార్ను నూతన ఆర్థిక మంత్రిగా నియమించనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!