Pakistan: దురుద్దేశంతోనే ముశాల్కు కేబినెట్లో చోటు.. పాక్ నిర్ణయంపై మాజీ డీజీపీ వ్యాఖ్య
పాక్ (Pakistan) కేబినెట్లో వేర్పాటువాద నేత యాసీన్ మాలిక్ (Yasin Malik) భార్య ముశాల్కు (Mushaal) చోటు దక్కింది. ఈ నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ ఒకరు ట్వీట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: దురుద్దేశంతోనే యాసీన్ మాలిక్ (Yasin Malik) భార్య ముశాల్ హుస్సేన్ మాలిక్కు (Mushaal) పాక్ (Pakistan) కేబినెట్లో చోటు కల్పించారని జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ శేష్పాల్ వైద్ అన్నారు. పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ కేబినెట్లో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసీన్ మాలిక్ భార్య ముశాల్ హుస్సేన్ మాలిక్ను సలహాదారుగా నియమించడంపై మాజీ డీజీపీ స్పందిస్తూ ట్విటర్లో పోస్టు పెట్టారు. పాక్ కేబినెట్లో ఆమెకు చోటు కల్పించడం ద్వారా వేర్పాటువాదులకు తమ దేశం మద్దతు పలుకుతుందనే సందేశాన్ని భారత్కు పంపించిందని శేష్పాల్ పేర్కొన్నారు. మానవ హక్కులపై ప్రధానికి ప్రత్యేక సలహాదారుగా ముశాల్ వ్యవహరించనున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో మాజీ డీజీపీ ఇలా వ్యాఖ్యానించారు. ఈ విమర్శపై యాసిన్ మాలిక్కు చెందిన జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) స్పందించింది. ‘మేము ఆమెను గౌరవిస్తాం. కానీ, ఆమెకు జేకేఎల్ఎఫ్లో సభ్యత్వం లేదు. జేకేఎల్ఎఫ్, యాసిన్ భావజాలంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని’ ట్వీట్ చేసింది.
వేదికను పంచుకోనున్న మోదీ-జిన్పింగ్..!
కశ్మీర్ వేర్పాటువాదిగా ముద్రపడిన యాసిన్ మాలిక్ ప్రస్తుతం తిహాడ్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడనే ఆరోపణలు నిరూపితం కావడంతో అతడికి శిక్ష పడింది. అప్పట్లో ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రబియా సయీద్ను అపహరించి యాసిన్ మాలిక్ సంచలనం సృష్టించాడు. 1989లో రబియాను అపహరించి.. ప్రతిగా ఆమెను విడుదల చేయడానికి ఐదుగురు ఉగ్రవాదులను విడిపించుకున్నారు. రబియా మొహబూబా ముఫ్తీ సోదరి. తాజాగా యాసీన్ భార్యకు పాక్ కేబినెట్లో చోటు దక్కడంపై మొహబూబా ముఫ్తీని ఓ మీడియా సంస్థ స్పందన కోరింది. ‘భారత్లో ఏం జరుగుతుందో మాట్లాడండి.. పాకిస్థాన్లో కాదు. భారత్లో ఎన్నికల సంఘం సహా అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని’ ఆమె మండిపడ్డారు.
ఎవరీ ముశాల్?
ముశాల్ హుస్సేన్ మాలిక్ పాకిస్థాన్ దేశస్థురాలు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి ఆమె పట్టభద్రురాలైంది. 2009లో యాసిన్ను వివాహమాడింది. అప్పటికి ముశాల్ వయసు 23 ఏళ్లు కాగా.. యాసీన్కు 42 సంవత్సరాలు. ముషాల్కు చిత్రకారిణిగానూ పేరుంది. ఆమె గీసిన కొన్ని చిత్రాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ముషాల్ 2014లో రెండుసార్లు భారత్కు వచ్చింది. ఆ తర్వాత తన వీసా రెన్యువల్ చేసుకోలేదు. 2019లో యాసిన్ అరెస్టు నేపథ్యంలో మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. వీరి 11 ఏళ్ల కుమార్తె రజియా సుల్తాన్.. జైల్లో ఉన్న తన తండ్రిని చూడటానికి ఇటీవల అనుమతి కోరినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంపై విభిన్న ప్రచారాలు జరుగుతున్నాయి. అంతరిక్ష లేజర్లు.. వారసత్వ పోరు కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయారని వీటిల్లో పేర్కొంటున్నారు. -
ఎట్టిపరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక
Sri Lanka: బాధ్యతాయుత పొరుగుదేశంగా భారత భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలను అనుమతించబోమని శ్రీలంక స్పష్టం చేసింది. గత ఏడాది చైనా గూఢచార నౌక ఒకటి శ్రీలంక తీరంలో ఆగడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది. అయితే, ఈ సందర్భంగా ఆయనపై ఉన్న ఆరోపణలను గుర్తుచేసింది. -
అదే డేంజర్ బెల్!
ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగున్నర దశాబ్దాల నాటి హెలికాప్టర్. మరమ్మతులు, నిర్వహణకు సరైన విడిభాగాలు లేవు. ఇదేదో సరకు రవాణాకు ఉపయోగించే లోహవిహంగం కాదు.. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పయనిస్తున్న హెలికాప్టర్. -
మతబోధకుడి స్థాయి నుంచి అధ్యక్ష పీఠం వరకు
ఇబ్రహీం రైసీ.. ప్రస్తుత ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకే కాదు.. అంతకుముందు అధినేతగా ఉన్న ఖొమైనీకీ సన్నిహితుడే. ఈ ఇద్దరి అధినేతల అండతోనే మతబోధకుడిగా ప్రస్థానం ప్రారంభించిన రైసీ అధ్యక్ష స్థానం వరకు ఎదిగారు. రైసీ సంస్కరణ వాది కాదు.. కరడుగట్టిన సంప్రదాయ వాది. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ ఇవ్వండి
ఇజ్రాయెల్-హమాస్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా హమాస్, ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్ సోమవారం కీలక అభ్యర్థనలు చేశారు. -
శ్రీలంక ఆలయంలో సరయు నదీ జలాలతో కుంభాభిషేకం
శ్రీలంకలోని సీతా అమ్మన్ ఆలయానికి ఆదివారం నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీలంక, భారత్, నేపాల్కు చెందిన వేల మంది భక్తులు పాల్గొన్నట్లు భారత హైకమిషన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. -
అసాంజేకు భారీ ఊరట
గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు సోమవారం లండన్ న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. -
‘కలుషిత రక్తం’ కుంభకోణంపై రిషి సునాక్ క్షమాపణలు
బ్రిటన్లో 1970ల్లో చోటుచేసుకున్న కలుషిత రక్తం కుంభకోణాన్ని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) కప్పిపుచ్చినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి ప్రధానమంత్రి రిషి సునాక్ సోమవారం క్షమాపణలు తెలిపారు. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్సులోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. తక్షణం రంగంలోకి దిగిన ‘ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ’ ఘటన జరిగిన ప్రాంతాన్ని సోమవారం ఉదయం గుర్తించింది. -
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసినా.. అనేక మందితో లైంగిక కార్యకలాపాలు కొనసాగించిన ఓ సెక్స్ వర్కర్ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు