Pakistan: పాకిస్థాన్పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!
ఇప్పటికే తీవ్ర విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్.. త్వరలోనే ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కనిష్ఠ స్థాయికి పాకిస్థానీ రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతుల కోసం భారీగా చెల్లించాల్సి వస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని (Economic Crisis) ఎదుర్కొంటున్న పాకిస్థాన్లో పరిస్థితులు మున్ముందు మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి ఇంధనం దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారక నిల్వలు సరిపడా లేకపోవడంతో పాక్ (Pakistan) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇందుకోసం రుణ సాయం, చెల్లింపులు చేయడాన్ని బ్యాంకులు నిలిపివేయడంతో ఇంధన సంక్షోభానికి (Fuel Crisis) దారితీయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తీవ్ర విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్.. ఈ క్రమంలో మరో శ్రీలంక మాదిరిగా తయారవుతుందా అనే ఆందోళనలు కూడా అక్కడ నెలకొన్నాయి.
పాకిస్థాన్ దిగుమతుల్లో అత్యధిక భాగం ఇంధనానిదే. దేశంలో విద్యుత్ వార్షిక వినియోగంలో మూడో వంతు దిగుమతి చేసుకున్న సహజ వాయువుతోనే తయారవుతోంది. పాకిస్థానీ రూపాయి విలువ రికార్డు స్థాయిలో కనిష్ఠానికి పడిపోతుండటంతో దిగుమతుల కోసం భారీగా చెల్లించాల్సి వస్తోంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ధరలు పెరగడం పాకిస్థాన్కు గుదిబండగా మారింది. విదేశీ మారక నిల్వలు క్షీణిస్తున్న కారణంగా ఆయిల్ వ్యాపారులు కూడా పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలైన పీఎస్ఓతోపాటు పాకిస్థాన్ ఎల్ఎన్జీ లిమిటెడ్లు గత రెండు నెలలుగా టెండర్లే పిలవలేదట. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ల్లో ఆలస్యం కారణంగా పెట్రోల్ కార్గోలు రద్దైనట్లు ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు వెల్లడించారు. దీంతో రానున్న రోజుల్లో ఇంధన సంక్షోభం తప్పదనే ఆందోళన అక్కడి అధికారుల్లో మొదలైనట్లు తెలుస్తోంది. ‘పక్షం రోజుల వరకు ఇంధన కొరత ఏమీ ఉండదు. లెటర్ ఆఫ్ క్రెడిట్(LCs) ఇప్పుడు రాకుంటే.. రెండు వారాల తర్వాత ఈ కొరత కనిపించవచ్చు’ అని ఓ ఆయిల్ సంస్థకు చెందిన సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు.
అధికారుల లెక్కల ప్రకారం, పాకిస్థాన్కు ప్రతినెల 4.3 లక్షల టన్నుల పెట్రోల్, 2 లక్షల టన్నుల డీజిల్, ఆరున్నర లక్షల టన్నుల క్రూడ్ ఆయిల్ అవసరం. వీటి విలువ 1.3 బిలియన్ డాలర్లుగా అంచనా. 2021 డిసెంబర్లో 6 లక్షల టన్నుల పెట్రోల్ను దిగుమతి చేసుకోగా.. గతేడాది డిసెంబరులో కేవలం 2.2 లక్షల టన్నుల పెట్రోల్ మాత్రమే కొనుగోలు చేసినట్లు ఓసీఏసీ వెల్లడించింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుంచి ఆర్థిక ప్యాకేజీని ఆశిస్తోన్న పాకిస్థాన్.. ఆ సంస్థ పెట్టే షరతులకు కట్టుబడి ఉంటామని తెలిపింది. దీంతో ఐఎంఎఫ్కు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. ఆదివారం ఒక్కరోజే 16శాతం పెంచగా.. పెట్రోల్ ధర లీటరుకు 249 పాకిస్థానీ రూపాయలకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం