Imran Khan: భారత్ను ఏ ‘సూపర్ పవర్’ శాసించలేదు’ : ఇమ్రాన్ ఖాన్
సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు....
ఇస్లామాబాద్: పాక్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని అక్కడి ప్రజలకు ప్రధాని ఇమ్రాన్ఖాన్ పిలుపునిచ్చారు. ప్రజలు ఆదివారం శాంతియుతంగా వీధుల్లోకి వచ్చి ‘దిగుమతి చేసుకున్న ప్రభుత్వానికి’ వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని కోరారు. విదేశీ శక్తులు పాకిస్థాన్లో తమ ప్రభుత్వాన్ని పడగొట్టి వారికి అనుకూలమైన వ్యక్తిని అధికారంలోకి కూర్చోబెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు, డబ్బులు సంపాదించేందుకు ప్రతిపక్షాలు వారితో చేతులు కలిపాయన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. తనపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేస్తూ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిన్న రాత్రి ఇచ్చిన ఇచ్చిన తీర్పు తనను బాధించిందనీ.. కానీ ఆ తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో శనివారం ఉదయం 10గంటలకు జాతీయ అసెంబ్లీని సమావేశపరిచి, ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఎదుర్కోవాల్సి ఉంది. ఈ తరుణంలో శుక్రవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా భారత్పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ అగ్రారాజ్యం భారత విదేశాంగ విధానాన్ని శాసించలేదని పేర్కొన్నారు. ‘ఇతరుల కంటే భారత్ గురించి నాకే ఎక్కువగా తెలుసు. ఏ ‘సూపర్ పవర్’ భారత విదేశాంగ విధానాన్ని శాసించలేదు. దానికి కారణం ఆర్ఎస్ఎస్ భావజాలమే. అదే భారత్ను పాకిస్థాన్ను వేరుచేసింది’’ అని అన్నారు. పాకిస్థాన్కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలని ఇమ్రాన్ఖాన్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలతో పాటు ఆ దేశ మీడియాపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షాలు బేరసారాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సభ్యులను గొర్రెల్లాగా కొనుగోలు చేస్తున్నాయని, ప్రమాదకరమైన గుర్రపుస్వారీ చేస్తున్నాయని ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు అంతర్జాతీయ కుట్ర ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశీ శక్తులు పాకిస్థాన్లో నామమాత్రపు వ్యక్తిని అధికారంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. పాకిస్థాన్లో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా, బనానా రిపబ్లిక్ (రాజకీయంగా అస్తవ్యస్థంగా ఉండటంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలను బనానా రిపబ్లిక్ అని వ్యవహరిస్తారు) ఉన్నచోటా ఇలా బహిరంగంగా జరగదని వ్యాఖ్యానించారు. 22 కోట్ల మన ప్రజలకు ఎవరో బయటి నుంచి ఆర్డర్లు ఇవ్వడం తీవ్ర అవమానకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పతనాన్ని సంబరాలు చేసుకుంటోందంటూ పాక్ మీడియాపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434