G20 Summit: ప్రపంచం మమ్మల్ని పక్కనపెట్టింది : భారత్పై ‘పాకిస్థానీల’ ప్రశంసలు!
అగ్రదేశాధినేతలు వచ్చిన సదస్సును (G20 Summit) విజయవంతంగా నిర్వహించడంపై పాక్ పౌరులు భారత్పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జీ20 శిఖరాగ్ర సదస్సులో చేసిన తీర్మానాలకు (Delhi Declaration) సభ్యదేశాల్లో ఏకాభిప్రాయం తెచ్చేందుకు భారత్ చేసిన కృషిపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాయాది దేశం (Pakistan) మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, అగ్రదేశాధినేతలు వచ్చిన సదస్సును (G20 Summit) విజయవంతంగా నిర్వహించడంపై పాక్ పౌరులు మాత్రం భారత్పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. విదేశాంగ విధానంలో తమ దేశం విఫలమైందని.. ప్రపంచ దేశాలు తమను పక్కనపెట్టాయని వాపోయారు. అగ్రదేశాధినేతలు పర్యటించడం భారతీయులకు ఎంతో గర్వకారణమని, ప్రపంచానికి భారత్ ఎంతో ముఖ్యమైన దేశంగా నిలిచిందనే విషయం నిరూపితమవుతోందని అన్నారు.
దిల్లీలో ఇటీవల నిర్వహించిన జీ20 సదస్సుకు 20 సభ్యదేశాల అధినేతలతో సహా 30దేశాధినేతలు హాజరయ్యారు. దీనిపై పాకిస్థానీ పౌరులు స్పందిస్తూ.. ‘జీ20 సదస్సు నిర్వహించడం యావత్ దేశానికి (భారత్కు) ఎంతో గర్వకారణమే కాకుండా వారి ఆర్థికవ్యవస్థకు ఎంతో ఊతమిస్తుంది’ అని కరాచీకి చెందిన ఓ వ్యక్తి మీడియాతో పేర్కొన్నాడు. ‘సౌదీ అరేబియా యువరాజు కూడా భారత్కు వచ్చారు. పాకిస్థాన్కు వస్తాడని భావించినప్పటికీ రాలేదు. దీన్ని బట్టి చూస్తేనే ప్రపంచానికి భారత్ ఎంత ముఖ్యమైందో అర్థమవుతోంది. జీ20 వంటి అతిపెద్ద సదస్సులు నిర్వహించినప్పుడు.. ఆ దేశం (భారత్) ఎలా ముందుకు వెళ్తుందో ప్రత్యక్షంగా గమనించే వీలుంటుంది’ అని మరో స్థానికుడు పేర్కొన్నాడు.
జీ20 సదస్సు నిర్వహణ భేష్..భారత్కు అమెరికా ప్రశంస
ఈ సదస్సుకు బంగ్లాదేశ్కు ఆహ్వానం పంపినప్పటికీ.. పాకిస్థాన్కు మాత్రం ఎటువంటి పిలుపు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని కరాచీకి చెందిన ఓ వ్యక్తి పేర్కొన్నాడు. పాకిస్థాన్ విదేశీ విధానం ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోందన్నాడు. జీ20 నిర్వహణతో భారత్ మాత్రం మరో ముందగుడు వేసిందన్నారు. ‘ఇలా తమ దేశం ఒంటరి అయ్యిందని భావిస్తోన్న వేళ.. దేశ భౌగోళిక రాజకీయ పరిస్థితులు దారుణంగా క్షీణించాయి. గడిచిన 5-6 ఏళ్లలో మా ఆర్థికవ్యవస్థ, భద్రతా పరిస్థితులు మరింత దిగజారాయని.. అందుకే ప్రపంచం తమను (Pakistan) పక్కన పెట్టేసింది’ అని మరో వ్యక్తి వాపోయాడు. తమ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ.. భారత్ మాత్రం టాప్20 దేశాలకు ఆతిథ్యమివ్వడం ఆ దేశ (భారత్) పౌరులకు ఎంతో గర్వకారణమని కరాచీకి చెందిన మరో స్థానికుడు పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!