SCO Summit: ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ : ఎస్సీవో సదస్సులో ప్రధాని మోదీ
ప్రపంచ వ్యాప్తంగా సరఫరా గొలుసుకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతోన్న తరుణంలో మెరుగైన రవాణా వ్యవస్థలను కొనసాగించడానికి ప్రాంతీయ కూటమి దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
వచ్చేఏడాది భారత్లో సదస్సుకు చైనా మద్దతు
సమర్ఖండ్: ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి (Coronavirus), మరోవైపు ఉక్రెయిన్లో యుద్ధం (Ukraine Crisis) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార, ఇంధన సంక్షోభాలు నెలకొన్నాయి. వీటివల్ల సరఫరా గొలుసుకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతోన్న తరుణంలో మెరుగైన రవాణా వ్యవస్థలను కొనసాగించడానికి ప్రాంతీయ కూటమి దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉజ్బెకిస్థాన్లో జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (SCO Summit) సదస్సులో సభ్య దేశాలనుద్దేశించి ప్రసంగించిన మోదీ.. భారత్ను ప్రపంచంలోనే తయారీ హబ్గా తీర్చిదిద్దడంలో పురోగతి సాధిస్తున్నామని అన్నారు.
‘కొవిడ్-19 మహమ్మారిని ప్రపంచం దీటుగా ఎదుర్కొంటోంది. దీంతో పాటు ఉక్రెయిన్లో నెలకొన్న సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా వ్యవస్థలకు ఎన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మెరుగైన కనెక్టివిటీ, ఆటంకం లేని రవాణా వ్యవస్థలపై ఎస్సీవో దృష్టి సారించాలి. ఈ విషయంలో కూటమి దేశాల మధ్య పరస్పర విశ్వాసం, సహకారానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యుద్ధం కారణంగా దెబ్బతిన్న అఫ్గానిస్థాన్కు వస్తువులు సరఫరా చేసేందుకు భారత్ చేస్తోన్న ప్రయత్నాలకు పాకిస్థాన్ అడ్డుతగులుతున్న విషయాన్నిపరోక్షంగా తెలుపుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రతి రంగంలోనూ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోన్న భారత్... ఎస్సీవో దేశాలతోనూ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందన్నారు.
ఆవిష్కరణల కేంద్రంగా భారత్..
‘ప్రజా కేంద్రక అభివృద్ధి మోడల్పై మేం దృష్టి పెడుతున్నాం. ప్రతి రంగంలోనూ ఆవిష్కరణలకు మద్దతు ఇస్తున్నాం. ప్రస్తుతం దేశంలో 70 వేల స్టార్టప్లతోపాటు వందకుపైగా యూనికార్న్ సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది భారత్ వృద్ధిరేటు 7.5 శాతంగా అంచనా వేస్తున్నాం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్నదాంట్లో భారత్ కూడా ఒకటని చెప్పడం సంతోషంగా ఉంది. సంప్రదాయ వైద్య చికిత్సలో ఎంతో పురోగతి సాధిస్తున్నాం’ అని ప్రధాని మోదీ వివరించారు. ఈ క్రమంలో అంతర్జాతీయ సంప్రదాయ ఔషధ కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే గుజరాత్లో ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు.
భారత్లో సదస్సుకు చైనా మద్దతు
మరోవైపు, ఎస్సీవో సదస్సు సందర్భంగా ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, వాణిజ్యాన్ని మరింత మెరుగుపరచుకునే మార్గాలు, అందుకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్తోపాటు ఎస్సీవో కూటమి దేశాల అధినేతలు చర్చించారు. ఈ సందర్భంగా సభ్యదేశాధినేతలు గ్రూప్ ఫొటో దిగిన సమయంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ పక్కపక్కనే నిలబడటం విశేషం. ఐతే వచ్చే ఏడాది ఎస్సీవో సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడానికి చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ పూర్తి మద్దతు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
చైనా యుద్ధ విమానాలు మరోసారి ఆస్ట్రేలియాను బెదిరించే ప్రయత్నం చేశాయి. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం ముదిరింది. -
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
క్రెమ్లిన్లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. -
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
చైనాలోని ఓ ఆసుపత్రిలో దుండగుడు కత్తులతో జరిపిన దాడిలో పలువురు చనిపోయారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. -
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
Rafah crossing: రఫాపై దాడి కొనసాగిస్తున్న ఇజ్రాయెల్.. ఇక్కడి సరిహద్దు క్రాసింగ్ను తన ఆధీనంలోకి తీసుకుంది. -
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?