Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ పట్టాలపై సమరం ఎందుకు..?
ఉక్రెయిన్పై రష్యా సేనలు దండెత్తిన నాటి నుంచి రైల్వే లైన్లు కీలకంగా మారాయి. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్లో ఇవి నిర్ణాయకంగా
దళాల జీవరేఖగా రైల్వేలు
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్పై రష్యా సేనలు దండెత్తిన నాటి నుంచి రైల్వే లైన్లు కీలకంగా మారాయి. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్లో ఇవి నిర్ణయాత్మకంగా మారడంతో వీటిపై ఆధిపత్యం కోసం.. లేదా ప్రత్యర్థులకు నిరుపయోగంగా మార్చడం కోసం ఇరుపక్షాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఇటీవల లైమన్ పట్టణంలో రష్యా దళాలు ఓ రైల్వే హబ్ను స్వాధీనం చేసుకొన్నాయి. తాజాగా దానికి సమీపంలోనే పొపాస్నా అనే మరో కీలక రైల్వే జంక్షన్ కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్ దళాలు రష్యాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న సీవియెరోదొనెట్స్క్లో కూడా కీలకమైన కార్గోస్టేషన్ ఉంది. వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే రైల్వే మార్గాల్లో కీలక ప్రదేశాలపై మాస్కో ఎక్కువ దృష్టిపెట్టినట్లు అర్థమవుతోంది.
రష్యా సరఫరాలు ఆ మార్గంలోనే..
ప్రపంచంలో రైల్వేలపై అత్యధికంగా ఆధారపడే సైన్యాల్లో రష్యా ముందు వరుసలో ఉంటుంది. సైనిక చర్య తొలినాళ్లలో రైల్వే లైన్లపై పట్టు సాధించలేక.. రోడ్డు మార్గాన్ని నమ్ముకొని రష్యా దళాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. కానీ, ఆ తర్వాత మాస్కో ఉక్రెయిన్లోని తూర్పు డాన్బాస్ ప్రాంతంపై దృష్టిపెట్టి భారీగా భూభాగాలను స్వాధీనం చేసుకొంది. దీనికి ముఖ్యకారణం అప్పటికే అక్కడ రష్యా కొంత భూభాగాన్ని ఏళ్ల క్రితమే తమ అధీనంలోకి తీసుకుంది. ఆ ప్రాంతంలో రైల్వే మార్గాల నుంచి రష్యా తమ దళాలకు మందుగుండు, రేషన్ను సరఫరా చేసింది.
వాస్తవానికి డాన్బాస్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో అక్కడ బలమైన రైల్వే నెట్వర్క్ ఉంది. 19వ శతాబ్ధంలో పారిశ్రామిక విప్లవం మైదలైనప్పటి నుంచి ఇక్కడి గనులు, కర్మాగారాలు, రేవులను అనుసంధానించేలా రైల్వేలైన్లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు పంటలు బాగా పండే ప్రాంతం కావడంతో ప్రపంచ దేశాలకు ధాన్యం ఎగుమతుల కోసం కూడా రైల్వేలను గణనీయంగా అభివృద్ధి చేశారు.
డాన్బాస్ మైదాన ప్రాంతం కావడంతో ఇక్కడ భారీ స్థాయిలో శతఘ్నులు, ట్యాంకులు, హోవిట్జర్లను రష్యా మోహరించింది. భారీ బరువుతో ఉండే వీటిని తరలించాలంటే రోడ్లు ఏమాత్రం తట్టుకోలేవు. రైళ్లు మాత్రమే అత్యంత అనుకూలంగా ఉంటాయి. దీంతోపాటు బలగాలకు ఇంధనం, ఆహారం భారీ ఎత్తున తరలించేందుకు అవకాశం లభిస్తుంది. రష్యాకు చెందిన సైనిక వ్యూహాలను అధ్యయనం చేసిన అమెరికా లెఫ్టినెంట్ కర్నల్ అలెక్స్ వెర్షినిన్ మాట్లాడుతూ... ‘‘రాకెట్ లాంఛర్లు, శతఘ్నులు వంటి భారీ ఆయుధాల తరలింపునకు మాస్కో రైళ్లపైనే పూర్తిగా ఆధాపడింది. రష్యన్లు చొచ్చుకొచ్చే కొద్దీ రైల్వేనెట్వర్క్లను ఆక్రమిస్తారు. డాన్బాస్లో ఇలాంటి నెట్వర్క్లకు కొదవలేదు. రైల్వేలు లేని చోట రష్యన్లు 120 మైళ్ల వరకు మాత్రమే సప్లై లైన్లను నిర్వహించగలరు’’ అని పేర్కొన్నారు.
కేవలం యుద్ధానికే కాదు.. రష్యా స్వాధీనం చేసుకొన్న ప్రదేశాల్లో నివసించే ప్రజలకు అవసరమైన నీరు, ఆహారం, ఇతర వస్తువులు సరఫరా చేయడానికి కూడా రైళ్లు అత్యంత కీలకమైనవి. ఇవి సక్రమంగా జరిగితేనే ప్రజలపై రష్యాకు నియంత్రణ లభిస్తుంది.
సొంత నెట్వర్క్లను ధ్వంసం చేసుకొన్న ఉక్రెయిన్..
దండయాత్ర మొదలైన నాటి నుంచి రష్యాకు అనుసంధానమయ్యే రైల్వే నెట్వర్క్లను ఉక్రెయిన్ దళాలే ధ్వంసం చేశాయి. మాస్కో సేనలు ముందడుగు వేయకుండా ఈ నిర్ణయం తీసుకొన్నాయి. ఏప్రిల్లో ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యాలోని బెల్గ్రోడ్ను కలిపే రైలు వంతెనను పేల్చివేశాయి. మే నెలలో సీవియెరోదొనెట్స్క్ సమీపంలోని రైలు నెట్వర్క్లను ధ్వంసం చేశాయి. ‘రష్యన్లకు ఉపయోగపడకుండా ఉక్రెయిన్ దళాలు రైలు నెట్వర్క్లను పేల్చివేస్తున్నాయి’ అని లండన్లోని రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఎమ్లీ ఫెర్రీస్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం