Russia: అనుమానాస్పద స్థితిలో రష్యా చమురు కంపెనీ డిప్యూటీ సీఈవో మృతి..!
యుద్ధం మొదలైన తొలినాళ్లలో ఉక్రెయిన్పై సానుభూతి చూపిన రష్యా కంపెనీ లుక్ ఆయిల్లో కీలక అధికారుల మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా సంస్థ డిప్యూటీ సీఈవో కార్యాలయంలోనే ఉరేసుకున్నాడు.
ఇంటర్నెట్డెస్క్: రష్యా (Russia)లోని రెండో అతిపెద్ద చమురు కంపెనీలో అనుమానాస్పద మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా లుక్ఆయిల్ కంపెనీలో మరో కీలక అధికారి ప్రాణాలు తీసుకున్నాడు. చమురు రంగ దిగ్గజాల్లో ఒకరైన విటాలీ రాబర్ట్స్ ఇటీవల మాస్కోలోని తన కార్యాలయంలో శవమై కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం అతడు కంపెనీ డిప్యూటీ సీఈవోగా పనిచేస్తున్నాడు. ఆఫీసులోనే ఉరి వేసుకున్నట్లు చెబుతున్నారు.
ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన నాటి నుంచి లుక్అయిల్లో అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన నాలుగో అధికారి రాబర్ట్స్. వీరంతా ఆత్మహత్యలు చేసుకుని లేదా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. రాబర్ట్స్ దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు. రష్యా ఫ్యూయల్ ఎనర్జీ కాంప్లెక్స్ ఏర్పాటులో అతడి పాత్ర కీలకం. అతడు ఆత్మహత్యకు ముందు విపరీతమైన తలనొప్పితో బాధపడ్డట్లు చెబుతున్నారు.
వాస్తవానికి యుద్ధం మొదలయ్యాక ఈ కంపెనీ చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. ఉక్రెయిన్లో విషాదకర పరిస్థితిపై అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత మే 2022లో కంపెనీ టాప్ మేనేజర్ అలెగ్జాండర్ సుబ్బోటిన్ (44) తన ఇంటి బేస్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
హూతీల వద్ద హైపర్సోనిక్ క్షిపణులు!
ఇక 2022 సెప్టెంబర్ 1వ తేదీన లుక్ఆయిల్ ఛైర్మన్ రావిల్మాగ్నోవ్ ఓ ఆసుపత్రి కిటికీ నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. 2023 అక్టోబర్లో కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ వ్లాదిమిర్ నెక్రసోవ్ హఠాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు వదిలారు.
రష్యాలో పుతిన్ను లేదా ఆయన నిర్ణయాలను విమర్శించిన వారు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆయన విమర్శకుల్లో 19 మంది చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రష్యా అధికారులు వీటిని ఆత్మహత్యలు, ప్రమాదాలుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు అనుమానాస్పద రీతిలో లేదా హఠాత్తుగా వివిధ కారణాలతో మరణించిన రష్యా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఏదో ఒక సందర్భంలో పుతిన్పై విమర్శలు చేసినవారే కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా