Saddam Hussein: నియంత విలాస నౌక.. నేటికీ సగం నీళ్లలోనే!
ఇరాక్పై అమెరికా సంకీర్ణ దళాల దండయాత్రకు 20 ఏళ్లు పూర్తవుతోంది. నాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ శక్తిసంపదలకు, అమెరికన్ సేనల దాడులకు గుర్తుగా ఇప్పటికీ ఓ విలాసవంత నౌక మనకు సగం నీట మునిగి కనిపిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాక్పై అమెరికా సంకీర్ణ దళాల దండయాత్ర(Iraq Invasion)కు నేటికి 20 ఏళ్లు పూర్తయ్యింది. 2003 మార్చి 20న అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, పోలాండ్లకు చెందిన పదాతిదళాలు ఇరాక్(Iraq)లోకి ప్రవేశించాయి. భారీ విధ్వంసాన్ని సృష్టించే ఆయుధాల(MDW)ల ఏరివేత, దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్(Saddam Hussein) ఉగ్రవాదానికి అందిస్తోన్న మద్దతు నిర్మూలన, ఇరాకీయులను విముక్తులను చేయడమే లక్ష్యంగా చెబుతూ.. దాదాపు 1.70 లక్షలకుపైగా సైనికులు ఇరాక్ వీధుల్లో అడుగుపెట్టారు. ఈ పరిణామాలతో సద్దాం 24 ఏళ్ల పాలనకు తెరపడింది. తదనంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడిన ఆయనకు.. 2006 డిసెంబర్ 30న ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే.
ఇలా.. ఇరాక్ దండయాత్రకు రెండు దశాబ్దాలు పూర్తవుతోన్నా.. సద్దాం హుస్సేన్ శక్తిసంపదలకు చిహ్నంగా, అమెరికన్ దాడులకు గుర్తుగా నేటికీ ఓ విలాస నౌక మనకు కనిపిస్తుంది. అదే ‘అల్- మన్సూర్’. ఇరాక్లోని ఓ జలరవాణా మార్గంలో సగం మునిగిపోయి, తుప్పుపట్టిన స్థితిలో ఉన్న ఈ నౌక.. నాటి చరిత్రను గుర్తుచేస్తుంది. 121 మీటర్ల పొడవున్న ‘అల్- మన్సూర్’ను 1980ల్లో నిర్మించారు. సద్దాంకు చెందిన మూడు నౌకల్లో ఇదీ ఒకటి. బంగారు కుళాయిలు, ఈత కొలనులు తదితర విలాస సౌకర్యాలతో తీర్చిదిద్దిన దీనిపై గరిష్ఠంగా 200 మంది ప్రయాణించవచ్చు. రాకెట్ లాంచింగ్ వ్యవస్థ, హెలిప్యాడ్ కూడా ఉన్నాయి. దండయాత్ర సమయంలో.. దాన్ని భద్రంగా ఉంచేందుకుగానూ బస్రాలో లంగరు వేయాలంటూ సద్దాం ఆదేశాలు జారీ చేశాడు.
అయితే, కొన్ని రోజులకే సంకీర్ణ సేనలు.. ‘అల్- మన్సూర్’ను లక్ష్యంగా చేసుకున్నాయి. దాడుల్లో ధ్వంసమైన ఈ నౌక.. షత్ అల్-అరబ్ జలమార్గంలో క్రమంగా ఒరిగిపోయి, సగం మునిగిపోయింది. ఒకవైపు సద్దాం పరారీ, మరోవైపు స్థానికంగా గందరగోళ పరిస్థితుల నడుమ.. అందులోని ఖరీదైన సామగ్రి, ఫర్నిచర్, విడిభాగాలు, ఇతరత్రా వస్తువులు లూటీ అయ్యాయి. శిథిలావస్థకు చేరుకున్న ఈ నౌక ప్రస్తుతం.. సందర్శకులు, స్థానికులకు విడిదిగా మారింది. ‘సద్దాం హయాంలో ఎవరూ దీని దగ్గరికి వచ్చే సాహసం చేయలేదు. ఇప్పుడు దాని చుట్టే తిరుగుతున్నారు’ అని స్థానికులు చెబుతున్నారు. దీన్ని పరిరక్షించాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ.. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా.. సకల సౌకర్యాలతో తయారు చేయించుకున్న ఈ నౌకలో సద్దాం ఎప్పుడూ ప్రయాణించకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు