Sri Lanka: శ్రీలంకలో ఔషధాల కొరత.. రోగులకు ‘మరణశిక్ష’ లాంటిదే..!
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్లాడుతోన్న ద్వీప దేశం శ్రీలంకను అత్యవసరాల కొరత కూడా వేధిస్తోంది. సంక్షోభం కారణంగా ఔషధాల కొరత ఏర్పడటంతో వైద్యులు అత్యవసర శస్త్రచికిత్సలను కూడా వాయిదా
మందులు లేక కీలక ఆపరేషన్లూ చేయలేకపోతోన్న వైద్యులు
ఇంటర్నెట్ డెస్క్: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్లాడుతోన్న ద్వీప దేశం శ్రీలంకను అత్యవసరాల కొరత కూడా వేధిస్తోంది. సంక్షోభం కారణంగా ఔషధాల కొరత ఏర్పడటంతో వైద్యులు అత్యవసర శస్త్రచికిత్సలను కూడా వాయిదా వేయాల్సి వస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరణాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఔషధాల సరఫరా కోసం శ్రీలంక విదేశాలపై ఆధారపడాల్సిందే. ఆ దేశం వినియోగించే మొత్తం ఔషధాల్లో 80శాతం దిగుమతి చేసుకునేవే. అయితే ఇప్పుడు విదేశీ కరెన్సీ రిజర్వులు తరగిపోవడంతో ఔషధాలను దిగుమతి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అటు ఔషధ నిల్వలు కూడా కరిగిపోయాయి. దీంతో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుందని అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందులు లేక అత్యవసర ఆపరేషన్లను కూడా చేయలేకపోతున్నామని అంటున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి ఆరోగ్యం నానాటికీ మరింత క్షీణిస్తోందని చెబుతున్నారు. తక్షణమే ఔషధ సరఫరాను పెంచకపోతే అనేక మంది రోగులకు అది మరణ శిక్షతో సమానమేనని హెచ్చరిస్తున్నారు.
దాదాపు 180 రకాల ఔషధాల కొరత ఉందని మందుల సరఫరా విభాగంలో పనిచేస్తోన్న ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. డయాలసిస్ రోగులకు ఇంజెక్షన్లు, క్యాన్సర్ ఔషధాలు కూడా అందుబాటులో లేవన్నారు. దీంతో ఆయా రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఔషధ సాయం చేసేందుకు భారత్, జపాన్ లాంటి దేశాలు ముందుకొచ్చినప్పటికీ.. మందులు దేశానికి వచ్చేందుకు నెలల సమయం పడుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం అధికార ప్రతినిధి డా. వాసన్ రత్నసింగం మాట్లాడుతూ.. ‘‘పెట్రోల్, వంట గ్యాస్ కోసం క్యూలైన్లలో నిల్చున్నట్లు కాదు.. ఔషధాల కొరత పరిస్థితి. చికిత్స ఆలస్యమైతే రోగుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఒకవేళ మందుల కోసం రోగులు క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తే వారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశలు వదులుకోవాల్సిందేనా..
నాలుగేళ్ల చిన్నారి బినులీ బింసారా లుకేమియాతో బాధపడుతోంది. మందులు లేక ఇప్పుడు ఆ పాప ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ‘‘ఇప్పటిదాకా మందులు ఉన్నాయి కదా పాపను బతికించుకోవచ్చన్న ఆశతో ఉన్నాం. కానీ ఇప్పుడు ఔషధాల కొరతతో ఆ ఆశ కూడా లేకుండా పోయింది. మేం నిస్సహాయ స్థితిలో ఉన్నాం. పాపకు చికిత్స చేసేందుకు మందులు లేవని వైద్యులు చెప్పినప్పటి నుంచి మా జీవితం అంధకారంగా మారింది. విదేశాలకు తీసుకెళ్లి వైద్యం చేయించే స్తోమత మాకు లేదు’’ అంటూ చిన్నారి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు