Bangladesh: రసాయనం చల్లి.. పొగ పెట్టి.. సినీఫక్కీలో తప్పించుకున్న మరణ శిక్ష ఖైదీలు!
మరణ శిక్ష పడిన ఇద్దరు కరడుగట్టిన ఉగ్రవాదులు కోర్టు ప్రాంగణంలోనే సినీఫక్కీలో తప్పించుకోవడం బంగ్లాదేశ్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ బంగ్లాదేశ్- అమెరికన్ బ్లాగర్ అవిజిత్ రాయ్, ఆయన పబ్లిషర్ ఫైజల్ అరెఫిన్ డిపన్ల వేర్వేరు హత్య కేసుల్లో ఈ ఇద్దరికి గతేడాది మరణ శిక్ష పడింది.
ఢాకా: మరణ శిక్ష పడిన ఇద్దరు కరడుగట్టిన ఉగ్రవాదులు కోర్టు ప్రాంగణంలోనే సినీఫక్కీలో తప్పించుకోవడం బంగ్లాదేశ్ (Bangladesh)లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ బంగ్లాదేశ్- అమెరికన్ బ్లాగర్ అవిజిత్ రాయ్(Avijit Roy), ఆయన పబ్లిషర్ ఫైజల్ అరెఫిన్ డిపన్ల హత్య కేసుల్లో ఈ ఇద్దరికి గతేడాది మరణ శిక్ష పడింది. ఈ క్రమంలోనే.. పేరుమోసిన నేరస్థులను నియంత్రించే విషయంలో పోలీసుల వైఫల్యంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్సరుల్లా బంగ్లా టీం(ABT) ఉగ్రసంస్థకు చెందిన ఈ ఇద్దరు ఉగ్రవాదులు.. మొయినుల్ హసన్ షమీమ్, అబు సిద్ధిఖ్ సోహెల్లను వేరే కేసులో విచారణకుగానూ ఆదివారం ఢాకాలోని కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం వారిని జైలుకు తరలించేందుకు బయటకు తీసుకొచ్చారు. అంతలోనే ద్విచక్ర వాహనాలపై కోర్టు ఆవరణలోకి దూసుకొచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఎస్కార్ట్ పోలీసులపై రసాయనం వెదజల్లి, ఇద్దరిని ఎక్కించుకుని పరారీ కావడం గమనార్హం.
దుండగులు స్ప్రే చేసిన రసాయనంతో పోలీసులకు తాత్కాలికంగా కళ్లు కనిపించలేదని, నిందితులు ఘటనాస్థలంలో పెద్దఎత్తున పొగ వచ్చేలా చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారి వెంట కేవలం ఇద్దరే ఎస్కార్ట్ పోలీసులు ఉన్నారని, హై ప్రొఫైల్ హత్య కేసుల్లోని దోషులనూ ఇతర సాధారణ ఖైదీల మాదిరిగానే పరిగణించారని కోర్టు అధికారి ఒకరు ఆరోపించారు. ఖైదీలకు కేవలం చేతులకే సంకెళ్లు వేశారని చెప్పారు.
ఇద్దరు ఉగ్రవాదులతోపాటు మిగతా నిందితులనూ పట్టుకునేందుకు దేశవ్యాప్తంగా అలర్ట్ జారీ చేశామని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజమాన్ ఖాన్ కమల్ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. మత ఛాందసవాదాన్ని బహిరంగంగా విమర్శించే అవిజిత్ రాయ్ను 2015 ఫిబ్రవరిలో ఉగ్రవాదులు ఢాకాలో హతమార్చారు. అప్పట్లో అమెరికా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. అదే ఏడాది నవంబర్లో డిపన్నూ చంపేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434