USA: అమెరికా అధీనంలో రష్యా ‘తెల్ల ఏనుగు’.. వృథాగా 20 మిలియన్ డాలర్ల ఖర్చు
రష్యా సంపన్నుడిని శిక్షించాలని అమెరికా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఫలితంగా నెలకు మిలియన్ డాలర్లు ఎదురు చెల్లించాల్సి వస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: రష్యా సంపన్నుడిని శిక్షించాలనే లక్ష్యంతో అమెరికా (USA) తీసుకొన్న ఓ నిర్ణయం బెడిసికొడుతోంది. నెలకు దాదాపు మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన సమయంలో క్రెమ్లిన్తో సన్నిహిత సంబంధాలున్న సంపన్నుడు సులేమాన్ కెరిమోవ్కు చెందిన విలాసవంతమైన నౌకను అమెరికా టాస్క్ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. దాదాపు 348 అడుగుల పొడవున్న ఈ నౌక పేరు ‘అమాడెయా’.
2022లో ఈ నౌక ఫిజీ తీరంలో ఉండగా స్థానిక అధికారులు, ఎఫ్బీఐ సిబ్బంది కలిసి స్వాధీనం చేసుకొన్నారు. బంగారం వ్యాపారి అయిన కెరిమోవ్ నౌక నిర్వహణ ఖర్చుల కోసం ఆంక్షలను ఉల్లంఘించి అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థను వాడుకొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఇది శాన్డియాగో తీరంలో నిలిపి ఉంది.
జెలెన్స్కీ, గ్రీక్ ప్రధాని కాన్వాయ్ లక్ష్యంగా క్షిపణి దాడి.. ?
తాజాగా ఈ నౌకను విక్రయించేందుకు అనుమతించాలని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు న్యాయమూర్తిని కోరారు. దీని నిర్వహణ ఖర్చులు భారీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 20 మిలియన్ డాలర్ల వరకు వెచ్చించినట్లు కోర్టు ఫైలింగ్లో పేర్కొన్నారు. సగటున నెలకు 6,00,000 డాలర్లు నిర్వహణ ఖర్చులు కాగా.. బీమాకు మరో 1.4 లక్షల డాలర్లు చెల్లించారు. ఇతరాలకు మరో 1.78 లక్షల డాలర్లను వెచ్చిస్తున్నారు. అమెరికా మార్షల్స్ సర్వీస్ ప్రకారం దీని విలువ 230 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపారు.
ఈ నౌక తమదేనని ఓ కంపెనీ ముందుకొచ్చింది. దీనిని మరో దానికి విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సివిల్ జప్తు దర్యాప్తును కొట్టేయాలన్న తమ అభ్యర్థనపై నిర్ణయం వెలువరించేవరకు దానిని ఆపాలని పేర్కొంది. ఒకవేళ దానిని తమకు అప్పగిస్తే అమెరికా చెల్లించిన నిర్వహణ ఖర్చులను కూడా వాపస్ చేస్తామని ఆఫర్ ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.