World Population: 800కోట్లకు చేరిన ప్రపంచ జనాభా
ప్రపంచ జనాభా 800కోట్లను అధిగమించింది. మంగళవారం 800వ కోట్ల చిన్నారి ఈ భూమ్మీదకు వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ జనాభా (World Population) మరో మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్న జనాల సంఖ్య 800కోట్లను తాకింది. మంగళవారం 800వ కోట్ల శిశువు ఈ భూమ్మీదకు వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి (United Nations) వెల్లడించింది. 48 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు. 1974లో ప్రపంచ జనాభా 400కోట్లుగా ఉండేది. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గి.. ఆయుర్దాయం గణనీయంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణమని ఐరాస తెలిపింది. మరో 15ఏళ్లకు అంటే.. 2037 నాటికి ప్రపంచ జనాభా 900కోట్లకు చేరే అవకాశముందని అంచనా వేసింది.
క్రీస్తు పూర్వం 8000 సంవత్సరం సమయంలో ప్రపంచ జనాభా దాదాపు 50 లక్షలుగా ఉండేదని అంచనా. క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికి అది 20 కోట్లకు చేరింది. కొన్ని అంచనాలు మాత్రం 30 కోట్లు, 60 కోట్లు అని కూడా చెబుతున్నాయి. 1804 సంవత్సరంలో ప్రపంచంలో మానవుల సంఖ్య వంద కోట్లకు చేరింది. పారిశ్రామిక విప్లవంతో ఆర్థిక పురోభివృద్ధి ఊపందుకుంది. వైద్యంలో అద్భుత పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా శిశువుల్లో అకాల మరణాలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా సగటు ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. ఇది జనాభా పెరుగుదలకు దారితీసింది.
ఇదీ చదవండి: మూలిగే నక్కపై తాటికాయలా అధిక జనాభా
ఈ నేపథ్యంలో ప్రపంచ జనాభా 200 కోట్ల స్థాయికి చేరుకోవడానికి 126 ఏళ్లు (1930 సంవత్సరంలో) పట్టింది. 300 కోట్ల మార్కుకు మరో 30 ఏళ్లు (1960), 400 కోట్ల స్థాయికి 14 ఏళ్లు (1974), 500 కోట్ల మార్కును తాకడానికి 13 ఏళ్లు (1987) పట్టింది. 600 కోట్ల స్థాయిని మాత్రం చాలా వేగంగా 11 సంవత్సరాల్లోనే (1998) మానవాళి సాధించింది. అనంతరం 700 కోట్ల స్థాయిని తాకడానికి 12 ఏళ్లు (2010) పట్టింది. ఆ తర్వాత మళ్లీ పుష్కర కాలానికి నేడు (నవంబరు 15, 2022) 800కోట్ల మార్కును తాకింది.
2023లో భారత్ నంబర్ వన్..
2023 నాటికి చైనా (China)ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిని దేశంగా భారత్ (India) నిలుస్తుందని ఐరాస అంచనా వేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో జనసంఖ్య 141.2కోట్ల మేర ఉండగా.. 2050 నాటికి అది దాదాపు 170 కోట్లకు చేరుకోవచ్చని తెలుస్తోంది. ఇక, చైనా జనాభా ప్రస్తుతం 145.2కోట్లు ఉండగా.. 2050 నాటికి 130 కోట్లకు తగ్గొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
చైనా యుద్ధ విమానాలు మరోసారి ఆస్ట్రేలియాను బెదిరించే ప్రయత్నం చేశాయి. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య వివాదం ముదిరింది. -
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
క్రెమ్లిన్లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరోసారి బాధ్యతలు స్వీకరించారు. -
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
చైనాలోని ఓ ఆసుపత్రిలో దుండగుడు కత్తులతో జరిపిన దాడిలో పలువురు చనిపోయారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. -
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
Rafah crossing: రఫాపై దాడి కొనసాగిస్తున్న ఇజ్రాయెల్.. ఇక్కడి సరిహద్దు క్రాసింగ్ను తన ఆధీనంలోకి తీసుకుంది. -
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
India-Maldives: భారత్, మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాన్ని సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. -
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్ రిపబ్లిక్ కోర్టు బ్రేకులు వేసింది. -
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
Sunita Williams: సునీతా విలియమ్స్ చేపట్టాల్సిన మూడో రోదసి యాత్ర వాయిదా పడింది. రాకెట్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మిషన్ను నిలిపివేస్తున్నట్లు నాసా ప్రకటించింది. -
నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. -
అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం
ఇజ్రాయెల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలగిన హమాస్.. రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. -
ట్రంప్నకు వెయ్యి డాలర్ల జరిమానా
హష్ మనీ కేసులో అనవసర వ్యాఖ్యలు చేయకుండా జారీ చేసిన గ్యాగ్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకుగాను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కోర్టు మరోసారి కొరడా ఝుళిపించింది. -
రష్యా నుంచి రాయబారిని వెనక్కు పిలిచిన జర్మనీ
రష్యాలోని తమ రాయబారి అలెగ్జాండర్ లాంబ్సడార్ఫ్ను వారం రోజలు పాటు వెనక్కు పిలిపించినట్లు జర్మనీ సోమవారం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో మరో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్