Ukraine Crisis: శవాల మాటున ల్యాండ్మైన్లు.. జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు!
ఉక్రెయిన్లో యుద్ధ వ్యూహాన్ని మార్చే క్రమంలో ఉన్న రష్యా శుక్రవారం రాజధాని కీవ్ శివారుల నుంచి కొన్ని బలగాలను ఉపసంహరించింది....
కీవ్: ఉక్రెయిన్లో యుద్ధ వ్యూహాన్ని మార్చే క్రమంలో ఉన్న రష్యా శుక్రవారం రాజధాని కీవ్ శివారుల నుంచి కొన్ని బలగాలను ఉపసంహరించింది. నగరానికి దాదాపు 18 కి.మీ దూరంలో ఉన్న ఆంటోనొవ్ విమానాశ్రయం నుంచి బలగాలు పూర్తిగా వైదొలిగినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది. రష్యా బలగాల ఉపసంహరణ నెమ్మదిగా ఉన్నప్పటికీ.. పరిశీలించదగిన స్థాయిలోనే కొనసాగుతోందని అధ్యక్షుడు జెలెన్స్కీ తాజా వీడియో సందేశంలో తెలిపారు.
వారి ఉపసంహరణ ఓ పెద్ద ఉపద్రవం..
వెనక్కి వెళుతున్న రష్యన్ బలగాలు పెద్ద ఉపద్రవాన్నే సృష్టించి వెళుతున్నాయని జెలెన్స్కీ శనివారం తమ దేశ పౌరుల్ని హెచ్చరించారు. రాజధాని శివారు నుంచి వెనుదిరుగుతున్న రష్యన్ సైనికులు ఆయా ప్రాంతాల్లో ల్యాండ్ మైన్లను ఉంచి వెళుతున్నారని తెలిపారు. ఇళ్లు, శవాల దగ్గర మైన్లను పెట్టారని పేర్కొన్నారు. వారి ఉపసంహరణ వెనుక పెద్ద ప్రమాదమే పొంచి ఉందని తెలిపారు. ఇది నిజమని వ్యాఖ్యానించారు. తిరిగి సొంత ప్రాంతాలకు వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సాధారణ జీవితం గడపడానికి ఇంకా సమయం ఉందన్నారు. తిరిగి దాడులు జరగవని ఉక్రెయిన్ సైన్యం హామీ ఇచ్చే వరకూ వేచి చూడాలని తెలిపారు.
మే 9 నాటికి వారికి విజయం కావాలి..
రష్యా సైనికుల ఉపసంహరణపై ఉక్రెయిన్ జాతీయ భద్రతా, రక్షణ మండలి కార్యదర్శి ఒలెగ్జీ డేనీలోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ను నాశనం చేయాలనే ఆలోచనను రష్యా అధ్యక్షుడు పుతిన్ అంత సులభంగా వదిలిపెట్టరని వ్యాఖ్యానించారు. దాడులను మరింత తీవ్రం చేసేలా బలగాలను పునరుద్ధరిస్తున్నారని విశ్లేషించారు. అందులో భాగంగానే ఈ ఉపసంహరణ అని తెలిపారు. రష్యన్లు స్వచ్ఛందంగా వీడుతున్నారని భావించొద్దని దేశ ప్రజలను విజ్ఞప్తి చేశారు. తమ సైన్యం కృషి వల్లే ఇదంతా జరుగుతోందన్నారు.
తమ వ్యూహంపై పునరాలోచించుకునేందుకు రష్యన్ సేనలు వెనుదిరుగుతున్నాయని ఒలెగ్జీ అన్నారు. ‘‘రష్యన్ సేనల ఉపసంహరణకు మనం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి రావొచ్చు. వారు వ్యూహాన్ని పూర్తిగా పునరుద్ధరించుకుంటున్నారు. వారికి విజయం కావాలి. వారి ముందు మే 9వ తేదీ లక్ష్యంగా ఉంది. అప్పటికల్లా వారు విజయంతో కవాతు నిర్వహించాలనుకుంటున్నారు. మన ముందు ఇంకా చాలా యుద్ధాలు ఉన్నాయి. కాబట్టి ఎవరూ విశ్రమించొద్దని కోరుతున్నాను. మనం కోరుకుంటున్న సంతోషకర పరిస్థితులు ఇప్పుడు లేవు’’ అని ఒలెగ్జీ ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రజలనుద్దేశించి అన్నారు.
అమెరికా మరింత సాయం..
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు మరింత సాయం అందించాలని అమెరికా నిర్ణయించింది. వారి సైనిక సామర్థ్యాన్ని పటిష్ఠం చేసే చర్యల నిమిత్తం 300 మిలియన్ డాలర్లు అందించనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా లేజర్ గైడెడ్ రాకెట్లు, డ్రోన్లు, రాత్రిపూట పనికొచ్చే ఉపకరణాలు, ఇతర ఆయుధాలు, వైద్య సామగ్రిని పంపనున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ సార్వభౌమత్వ పరిరక్షణకు అమెరికా కట్టుబడి ఉందని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.
మేం దాడి చేయలేదు..
రష్యా భూభాగంపై తాము దాడి చేసినట్లు వస్తోన్న ఆరోపణల్ని ఉక్రెయిన్ జాతీయ భద్రతా మండలి ఖండించింది. సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలోని బెల్గోరోద్లో ఉన్న చమురు నిల్వ కేంద్రంపై ఉక్రెయిన్ సైనికులు శుక్రవారం తెల్లవారుజామున రెండు హెలికాఫ్టర్ల ద్వారా బాంబులు కురిపించినట్టు స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ ఆరోపించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!