వివేకా హత్యకేసు నిందితులకు బెయిలివ్వొద్దు: తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ ఐఏఎస్ స్థాయి అధికారులనే ప్రభావితం చేయగల నిందితులకు సామాన్యులైన సాక్షులు ఓ లెక్క కాదంటూ సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. వైఎస్ భాస్కర్రెడ్డి వంటి పలుకుబడి గల నిందితులు బయట ఉంటే సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకురారని, భవిష్యత్తులో కింది కోర్టు విచారణ ప్రక్రియ ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చని పేర్కొంది. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి వ్యతిరేకంగా పోలీసు, ఏపీ ప్రభుత్వ వ్యవస్థలు పని చేస్తున్నాయని గుర్తుచేసింది. ప్రస్తుతం అభియోగాల నమోదు ప్రక్రియ నడుస్తోందని, నిందితులు విచారణకు ఆటంకాలు సృష్టిస్తున్నారని, ఈ దశలో బెయిలిస్తే పారదర్శక విచారణకు అడ్డంకులు తప్పవని సీబీఐ పేర్కొంది.
Published : 09 Apr 2024 11:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి