AP News: జగన్ ఐదేళ్ల పాలనలో కుదేలైన రవాణా రంగం

జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజా రవాణాను నిర్వీర్యం చేశారు. ఆర్టీసీ సంస్థలోకి ప్రైవేట్‌ వ్యక్తులకు గేట్లు తెరిచి ప్రభుత్వ సంస్థను పాతాళానికి తొక్కారు.

Published : 01 May 2024 10:23 IST

ప్రజా రవాణాను బలోపేతం చేయడం ప్రభుత్వాల ప్రధాన విధి. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ప్రజారవాణా వ్యవస్థను ప్రధాన రంగంగా చూస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇందుకు భిన్నం. జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజా రవాణాను నిర్వీర్యం చేశారు. ఆర్టీసీ సంస్థలోకి ప్రైవేట్‌ వ్యక్తులకు గేట్లు తెరిచి ప్రభుత్వ సంస్థను పాతాళానికి తొక్కారు. ప్రైవేటు, వ్యక్తిగత వాహనాలపై ఎడాపెడా పన్నుల భారం వేసి అందినకాడికి దండుకున్నారు. ఫలితంగానే నాడు కాలర్ ఎగరేసిన ఆటో, ట్యాక్సీ యజమానులు నేడు కన్నీరు కారుస్తున్నారు. 

Tags :

మరిన్ని