మీ హోటల్‌లో జిలేబీ బాగుంటుందట కదా!.. యజమానికి నారా బ్రాహ్మణి ఆత్మీయ పలకరింపు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని ఓ చిన్న హోటల్‌కు అనుకోని అతిథి రావడంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. దుగ్గిరాలలో ఎన్నికల ప్రచారం ముగించుకొని మార్గ మధ్యలోని పెదవడ్లపూడిలో ఓ చిన్న హోటల్‌ను నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి సందర్శించారు.

Published : 30 Apr 2024 21:47 IST

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని ఓ చిన్న హోటల్‌కు అనుకోని అతిథి రావడంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. దుగ్గిరాలలో ఎన్నికల ప్రచారం ముగించుకొని మార్గ మధ్యలోని పెదవడ్లపూడిలో ఓ చిన్న హోటల్‌ను నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి సందర్శించారు. అక్కడ అల్పాహారం తీసుకున్నారు. తన కుటుంబసభ్యుల కోసం జిలేబి, లడ్డూలను కొనుగోలు చేశారు. హోటల్‌కు బ్రాహ్మణి వచ్చారన్న సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. తనకు పెదవడ్లపూడి జిలేబీ అంటే ఇష్టమని బ్రాహ్మణి చెప్పారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు