Viveka Case: ఆధారాలు తుడుస్తుంటే.. అవినాష్‌ చూస్తూ ఉన్నారు: రవీంద్రనాథ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వివేకా హత్యకు సంబంధించిన ఆధారాలను ఎర్ర గంగిరెడ్డి తుడుస్తుంటే అవినాష్ రెడ్డి చూస్తూ నిలబడ్డారని జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా వీరపునాయునిపల్లె మండలం మొయిళ్ల కాల్వలో రెండ్రోజుల కిందట నిర్వహించిన ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రవీంద్రనాథ్ రెడ్డి మాటల్ని మౌనంగా వింటూ ఉండిపోవడం ద్వారా అవినాష్ రెడ్డికి ఆధారాల ధ్వంసం గురించి ముందే తెలుసనే అనుమానాలు వస్తున్నాయి. బాబాయి హత్య కేసులో ఆధారాలు తుడిచి వేస్తుంటే ఎలా ఊరుకున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

Published : 07 Apr 2024 09:40 IST

వివేకా హత్యకు సంబంధించిన ఆధారాలను ఎర్ర గంగిరెడ్డి తుడుస్తుంటే అవినాష్ రెడ్డి చూస్తూ నిలబడ్డారని జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా వీరపునాయునిపల్లె మండలం మొయిళ్ల కాల్వలో రెండ్రోజుల కిందట నిర్వహించిన ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రవీంద్రనాథ్ రెడ్డి మాటల్ని మౌనంగా వింటూ ఉండిపోవడం ద్వారా అవినాష్ రెడ్డికి ఆధారాల ధ్వంసం గురించి ముందే తెలుసనే అనుమానాలు వస్తున్నాయి. బాబాయి హత్య కేసులో ఆధారాలు తుడిచి వేస్తుంటే ఎలా ఊరుకున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

Tags :

మరిన్ని