Khammam: ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ
ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది. ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు మంత్రి నగరానికి రాగా.. శుక్రవారం ఉదయం ఆయన బస చేసిన ఓ హోటల్ ఎదుట తెదేపా శ్రేణులు నిరసన తెలిపారు. మంత్రి హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారంటూ కార్యకర్తలు ప్రశ్నించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేసుకోవాలి గానీ.. వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి.. తెదేపా కార్యకర్తలపైకి దురుసుగా దూసుకువచ్చారు. కార్యకర్తలు కూడా దురుసుగా మంత్రి మీదకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
Updated : 27 Oct 2023 13:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?