బ్రేకింగ్

breaking
03 May 2024 | 23:17 IST

కోల్‌కతా గెలుపు.. ముంబయికి నాలుగో ఓటమి

ముంబయి: ఐపీఎల్‌-2024లో ముంబయికి వరుసగా నాలుగో ఓటమి. కోల్‌కతా 24 పరుగుల తేడాతో ముంబయిపై విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి.. 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్‌ అయింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (56; 35 బంతుల్లో) అర్ధశతకంతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా తేలిపోయారు. కోల్‌కతా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 4, వరుణ్‌ 2, నరైన్‌ 2, రస్సెల్‌ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్‌ అయింది. వెంకటేశ్‌ అయ్యర్ (70), మనీష్‌ పాండే (42) రాణించారు.  తుషారా 3, బుమ్రా 3, హార్దిక్‌ 2, పీయూష్‌ ఒక వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు