
తాజా వార్తలు
కుమార్తెకు ప్రేమతో..
కాలేయంలో కొంతభాగం ఇచ్చిన తండ్రి
ఎమ్మిగనూరు, న్యూస్టుడే: తన చిట్టి తల్లి అనారోగ్యానికి గురికావడంతో ఆ తండ్రి మనసు పడ్డ బాధ అంతాఇంతా కాదు. అవసరమైతే ప్రాణాలిచ్చైనా తన చిన్నారిని కాపాడుకునే ఆ తండ్రి, తన కోసం తన కాలేయాన్ని ఇచ్చారు. ఆ పసిప్రాణాన్ని పదిలంగా ఒడిసిపట్టారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన లోక్నాథ్నాయుడు, హేమాంజలి దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె సంతానం. 18 ఏళ్లుగా ఆయన రిజర్వు పోలీసుగా ఉద్యోగం చేస్తున్నారు. నంద్యాలలో 16 ఏళ్లు పాటు పనిచేసి ఇటీవల అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేకు బదిలీ అయ్యి అక్కడే నివాసం ఉంటున్నారు. తన కుమార్తె అలోకితశ్రీ అనారోగ్యానికి గురికావడంతో కర్నూలు ఆసుపత్రికిలో చికిత్స చేయించారు. చిన్నారికి కామెర్లు ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు. చిన్నారి కాలేయం పూర్తిగా చెడిపోయిందని, ఎవరైనా తమ కాలేయంలోని కొంతభాగాన్ని ఇస్తే పాప ఆరోగ్యం మెరుగుపడుతుందని నిమ్స్ వైద్యులు తెలిపారు. తండ్రి లోక్నాథ్ తన కాలేయాన్ని అందిస్తానన్నారు. ఈనెల 13న డాక్టర్లు శ్రీనివాన్, అరవిందాచారి ఆపరేషన్ చేసి లోక్నాథ్నాయుడు కాలేయంలో 40 శాతాన్ని తీసి, దాన్ని అలోకితశ్రీకి అమర్చారు. ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇద్దరి ఆరోగ్యం మెరుగుగా ఉన్నట్లు బంధువులు తెలిపారు.