News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (22-03-2023)

Updated : 22 Mar 2023 17:57 IST
1/24
హైదరాబాద్ లో రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా హలీం తయారీకి సిద్ధం అయిన హలీం బట్టిలు హైదరాబాద్ లో రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా హలీం తయారీకి సిద్ధం అయిన హలీం బట్టిలు
2/24
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏలూరు జిల్లా దెందులూరులో బుధవారం తొమ్మిది మంది గ్రామ దేవతలకు ఊరేగింపు నిర్వహించారు. రామదండు ఆధ్వర్యంలో స్థానిక విష్ణు ఆలయంలో గ్రామ దేవతలకు నైవేద్యాన్ని తయారుచేసి ఆయా ఆలయాలకు పంపించి ఉత్సాహంగా ఊరేగింపు ప్రారంభించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏలూరు జిల్లా దెందులూరులో బుధవారం తొమ్మిది మంది గ్రామ దేవతలకు ఊరేగింపు నిర్వహించారు. రామదండు ఆధ్వర్యంలో స్థానిక విష్ణు ఆలయంలో గ్రామ దేవతలకు నైవేద్యాన్ని తయారుచేసి ఆయా ఆలయాలకు పంపించి ఉత్సాహంగా ఊరేగింపు ప్రారంభించారు.
3/24
కృష్ణా జిల్లా కోడూరులో కొబ్బరి చెట్లపై పిడుగు పడి చెట్ల తల మొత్తం మోడు బారిపోయింది. అయినప్పటికీ చెట్ల మొదళ్లో అలుముకున్న తీగచెట్లు పచ్చగా ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్లను వదలని బంధంలా అలుముకున్నాయి. ఈ దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కృష్ణా జిల్లా కోడూరులో కొబ్బరి చెట్లపై పిడుగు పడి చెట్ల తల మొత్తం మోడు బారిపోయింది. అయినప్పటికీ చెట్ల మొదళ్లో అలుముకున్న తీగచెట్లు పచ్చగా ఉన్నాయి. ఆ కొబ్బరి చెట్లను వదలని బంధంలా అలుముకున్నాయి. ఈ దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
4/24
నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయిలో ఉన్న నాని, కీర్తి, రానా ఉత్సహంగా ఉగాదిని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ చిత్రంలోని ‘ధూమ్‌ ధామ్‌’ వీడియో సాంగ్‌ను ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నారు. నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయిలో ఉన్న నాని, కీర్తి, రానా ఉత్సహంగా ఉగాదిని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ చిత్రంలోని ‘ధూమ్‌ ధామ్‌’ వీడియో సాంగ్‌ను ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నారు.
5/24
6/24
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రవీంద్రభారతిలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డి, నాయకులు హాజరయ్యారు. వేడుకలో భాగంగా కళాకారుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రవీంద్రభారతిలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డి, నాయకులు హాజరయ్యారు. వేడుకలో భాగంగా కళాకారుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.
7/24
ఉగాది వేడుకలో డోలు వాయిస్తున్న కళాకారులు ఉగాది వేడుకలో డోలు వాయిస్తున్న కళాకారులు
8/24
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ దంపతులు, రోజా హాజరయ్యారు. పంచాంగ శ్రవణం అనంతరం సీఎం దంపతులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ దంపతులు, రోజా హాజరయ్యారు. పంచాంగ శ్రవణం అనంతరం సీఎం దంపతులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
9/24
సీఎం జగన్‌కు బొట్టు పెడుతున్న వైఎస్‌ భారతి సీఎం జగన్‌కు బొట్టు పెడుతున్న వైఎస్‌ భారతి
10/24
హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఉగాది వేడుల సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. సిద్ధాంతి శ్రీనివాస్ శర్మ పంచాంగ శ్రవణం చేసిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఉగాది వేడుల సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. సిద్ధాంతి శ్రీనివాస్ శర్మ పంచాంగ శ్రవణం చేసిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
11/24
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం వైభ‌వంగా ఉగాది ఆస్థానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని పూలతోరణాలు, వివిధ కళాకృతులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం వైభ‌వంగా ఉగాది ఆస్థానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని పూలతోరణాలు, వివిధ కళాకృతులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
12/24
అందంగా ఏర్పాటు చేసిన కళాకృతి. అందంగా ఏర్పాటు చేసిన కళాకృతి.
13/24
నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, నాయకులు ఆసక్తిగా శుభకృత్‌ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, నాయకులు ఆసక్తిగా శుభకృత్‌ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
14/24
రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. ఈ సినిమాకు సంబంధించిన ‘డిక్క డిష్యూం’ అనే మాస్‌ సాంగ్‌ను ఉగాది కానుకగా ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. ఈ సినిమాకు సంబంధించిన ‘డిక్క డిష్యూం’ అనే మాస్‌ సాంగ్‌ను ఉగాది కానుకగా ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
15/24
అంబర్‌పేటలో మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆధ్వర్యంలో అండర్‌-19 క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఛైర్మన్‌ రేవంత్‌ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. అంబర్‌పేటలో మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆధ్వర్యంలో అండర్‌-19 క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఛైర్మన్‌ రేవంత్‌ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు.
16/24
మంగళగిరి తెదేపా జాతీయ పార్టీ కార్యాలయంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మంగళగిరి తెదేపా జాతీయ పార్టీ కార్యాలయంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
17/24
మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి పూజ చేస్తున్న ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ‘అందరికీ శోభకృత్‌ నామ ఉగాది శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి పూజ చేస్తున్న ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ‘అందరికీ శోభకృత్‌ నామ ఉగాది శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు.
18/24
కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలం పి.మల్లవరంలో తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని సత్తెమ్మతల్లి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలం పి.మల్లవరంలో తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని సత్తెమ్మతల్లి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
19/24
కల్యాణ్‌రామ్‌ హీరోగా కొత్త దర్శకుడు నవీన్‌ మేడారం తెరకెక్కిస్తున్న చిత్రం ‘డెవిల్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను చిత్రబృందం షేర్‌ చేస్తూ.. ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. కల్యాణ్‌రామ్‌ హీరోగా కొత్త దర్శకుడు నవీన్‌ మేడారం తెరకెక్కిస్తున్న చిత్రం ‘డెవిల్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను చిత్రబృందం షేర్‌ చేస్తూ.. ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
20/24
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడిలో నవదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారికి తొమ్మిది నదుల నీటితో అభిషేకం నిర్వహించారు. పూజారి 108 బిందెల పాలతో అభిషేకం చేశారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడిలో నవదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారికి తొమ్మిది నదుల నీటితో అభిషేకం నిర్వహించారు. పూజారి 108 బిందెల పాలతో అభిషేకం చేశారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
21/24
సందీప్‌ కిషన్‌ హీరోగా వి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను ట్వీట్‌ చేస్తూ.. చిత్రబృందం పండగ శుభాకాంక్షలు తెలిపింది. సందీప్‌ కిషన్‌ హీరోగా వి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను ట్వీట్‌ చేస్తూ.. చిత్రబృందం పండగ శుభాకాంక్షలు తెలిపింది.
22/24
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం(ఎన్‌బీకే108) రానుంది. ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఈ ఉగాదిని గొప్పగా సెలబ్రేట్ చేసుకోండి’ అని చిత్రబృందం ట్వీట్‌ చేసింది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం(ఎన్‌బీకే108) రానుంది. ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఈ ఉగాదిని గొప్పగా సెలబ్రేట్ చేసుకోండి’ అని చిత్రబృందం ట్వీట్‌ చేసింది.
23/24
నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్‌ కథానాయిక. నాని, కీర్తి జోడి ధరణి, వెన్నెల పాత్రలు పోషిస్తున్నారు. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్రబృందం ఓ ఫొటోను షేర్‌ చేసింది. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్‌ కథానాయిక. నాని, కీర్తి జోడి ధరణి, వెన్నెల పాత్రలు పోషిస్తున్నారు. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్రబృందం ఓ ఫొటోను షేర్‌ చేసింది. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
24/24
నాగశౌర్య హీరోగా పవన్‌ బాసంసెట్టి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. ఈ సినిమాకి ‘రంగబలి’ అని టైటిల్‌ పెట్టినట్లు చిత్రబృందం తెలిపింది. నాగశౌర్యకు ఇది 23వ సినిమా కావడం విశేషం. నాగశౌర్య హీరోగా పవన్‌ బాసంసెట్టి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. ఈ సినిమాకి ‘రంగబలి’ అని టైటిల్‌ పెట్టినట్లు చిత్రబృందం తెలిపింది. నాగశౌర్యకు ఇది 23వ సినిమా కావడం విశేషం.

మరిన్ని