News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (05-04-2023)

Updated : 05 Apr 2023 20:17 IST
1/27
ఈ నెల 8న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా కామన్‌ డీపీని విడుదల చేశారు. ఈ ఫొటోను చూసి ఆయన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఈ నెల 8న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా కామన్‌ డీపీని విడుదల చేశారు. ఈ ఫొటోను చూసి ఆయన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.
2/27
కొంపల్లిలోని సినీ ప్లానెట్ సమీపంలో ఏర్పాటైన ఇండో అరబిక్ రెస్టారెంట్‌ను సినీ నటి దివి ప్రారంభించారు.  ఈ సందర్భంగా అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కొంపల్లిలోని సినీ ప్లానెట్ సమీపంలో ఏర్పాటైన ఇండో అరబిక్ రెస్టారెంట్‌ను సినీ నటి దివి ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
3/27
వంటకాలను రుచి చూస్తున్న దివి వంటకాలను రుచి చూస్తున్న దివి
4/27
సినీనటుడు మహేశ్‌ బాబు, మాజీ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీల కామన్‌ డీపీని సంగీత దర్శకుడు తమన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. దక్షిణాదిలో వీళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఎక్కువ అని డీపీపై రాసి ఉంచారు. సినీనటుడు మహేశ్‌ బాబు, మాజీ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీల కామన్‌ డీపీని సంగీత దర్శకుడు తమన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. దక్షిణాదిలో వీళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఎక్కువ అని డీపీపై రాసి ఉంచారు.
5/27
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రిషభ్‌ పంత్‌ను కలిసిన ఫొటోను శుభ్‌మన్‌ గిల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టు పెట్టారు. పంత్‌ను ట్రూ వారియర్‌గా గిల్‌ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రిషభ్‌ పంత్‌ను కలిసిన ఫొటోను శుభ్‌మన్‌ గిల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టు పెట్టారు. పంత్‌ను ట్రూ వారియర్‌గా గిల్‌ పేర్కొన్నారు.
6/27
ప్రముఖ నటి, మాండ్య ఎంపీ సుమలత ప్రధాని నరేంద్ర మోదీని దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రముఖ నటి, మాండ్య ఎంపీ సుమలత ప్రధాని నరేంద్ర మోదీని దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.
7/27
ఇటీవల విడుదలైన ‘బలగం’ చిత్రం లక్షలాది మంది ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ నేపథ్యంలో సినిమాలో నటించిన  విజయలక్ష్మిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో సన్మానించారు. ఇటీవల విడుదలైన ‘బలగం’ చిత్రం లక్షలాది మంది ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ నేపథ్యంలో సినిమాలో నటించిన విజయలక్ష్మిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో సన్మానించారు.
8/27
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రోవింగ్ సనోజ్ చేపట్టిన పాదయాత్ర ఖమ్మంలోని సుజాతనగర్‌కు చేరుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 166 రోజులుగా 4,200 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించినట్లు రోవింగ్ సనోజ్ చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రోవింగ్ సనోజ్ చేపట్టిన పాదయాత్ర ఖమ్మంలోని సుజాతనగర్‌కు చేరుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 166 రోజులుగా 4,200 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించినట్లు రోవింగ్ సనోజ్ చెప్పారు.
9/27
గత మూడు రోజులుగా తిరుమలలోని వసంతోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సాలకట్ల వసంతోత్సవాలు బుధవారం కనులపండువగా ముగిశాయి. చివరిరోజున భూదేవి సమేత మలయప్పస్వామితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడికి వసంతోత్సవ సేవ చేశారు. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా తిరుమలలోని వసంతోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సాలకట్ల వసంతోత్సవాలు బుధవారం కనులపండువగా ముగిశాయి. చివరిరోజున భూదేవి సమేత మలయప్పస్వామితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడికి వసంతోత్సవ సేవ చేశారు. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
10/27
విజయ్‌ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విడుదల పార్ట్‌ 1’. ఈ సినిమాను ఏప్రిల్‌  15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇది తమిళంలో విడుదలైన ‘విడుతలై పార్ట్‌ 1’కు డబ్బింగ్‌ వెర్షన్‌. విజయ్‌ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విడుదల పార్ట్‌ 1’. ఈ సినిమాను ఏప్రిల్‌ 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇది తమిళంలో విడుదలైన ‘విడుతలై పార్ట్‌ 1’కు డబ్బింగ్‌ వెర్షన్‌.
11/27
సాయిధరమ్‌ తేజ్‌,  సంయుక్తా మేనన్‌ జంటగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరూపాక్ష’. ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే  విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ‘విరూపాక్ష’ ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్తా మేనన్‌ జంటగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరూపాక్ష’. ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ‘విరూపాక్ష’ ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
12/27
అహ్మదాబాద్‌లో ‘పంగుని ఉతిరం’ ఉత్సవంలో భాగంగా పలువురు భక్తులు ఇనుప రాడ్లను శరీరానికి గుచ్చుకొని కనిపించారు. ఇందులో ఓ వ్యక్తి ఏకంగా కారును లాగుతూ కనిపించారు. మురుగన్‌ అనే దేవుడికి భక్తులు ఇలా మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు దూరమవుతాయని వారి నమ్మకం. అహ్మదాబాద్‌లో ‘పంగుని ఉతిరం’ ఉత్సవంలో భాగంగా పలువురు భక్తులు ఇనుప రాడ్లను శరీరానికి గుచ్చుకొని కనిపించారు. ఇందులో ఓ వ్యక్తి ఏకంగా కారును లాగుతూ కనిపించారు. మురుగన్‌ అనే దేవుడికి భక్తులు ఇలా మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు దూరమవుతాయని వారి నమ్మకం.
13/27
‘30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్యరావు, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. చెందు ముద్దు దర్శకుడు. ఈ చిత్రంలోని ‘రంగమ్మ’ అనే పాటను ఏప్రిల్‌ 6న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్యరావు, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. చెందు ముద్దు దర్శకుడు. ఈ చిత్రంలోని ‘రంగమ్మ’ అనే పాటను ఏప్రిల్‌ 6న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
14/27
గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య తమ జట్టులోని అఫ్గాన్‌ క్రీడాకారులతో కలిసి సెహరీ(రంజాన్‌ మాసంలో సూర్యోదయం కాకముందే ముస్లింలు చేసే భోజనం) చేశారు. ఈ ఫొటోను రషీద్‌ఖాన్‌ ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. తమతో కలిసి పాండ్య భోజనం చేయడం ఆనందాన్నిచ్చిందని తెలిపారు. గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య తమ జట్టులోని అఫ్గాన్‌ క్రీడాకారులతో కలిసి సెహరీ(రంజాన్‌ మాసంలో సూర్యోదయం కాకముందే ముస్లింలు చేసే భోజనం) చేశారు. ఈ ఫొటోను రషీద్‌ఖాన్‌ ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. తమతో కలిసి పాండ్య భోజనం చేయడం ఆనందాన్నిచ్చిందని తెలిపారు.
15/27
న్యూజిలాండ్‌, శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో కిమ్‌ కాటన్‌ అనే మహిళ.. అంపైర్‌గా వ్యవహరించారు. మెన్స్ ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లో ఫిమేల్‌ అంపైర్‌గా వ్యవహరించిన మొట్టమొదటి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. (సోర్స్‌: ఐసీసీ ట్విటర్‌ ఖాతా) న్యూజిలాండ్‌, శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో కిమ్‌ కాటన్‌ అనే మహిళ.. అంపైర్‌గా వ్యవహరించారు. మెన్స్ ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లో ఫిమేల్‌ అంపైర్‌గా వ్యవహరించిన మొట్టమొదటి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. (సోర్స్‌: ఐసీసీ ట్విటర్‌ ఖాతా)
16/27
సినీనటి ఈషా రెబ్బా తన తాజా ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘జస్ట్‌ లవ్’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. ఈ ఫొటో బాగుందని ఆమె ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు. సినీనటి ఈషా రెబ్బా తన తాజా ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘జస్ట్‌ లవ్’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. ఈ ఫొటో బాగుందని ఆమె ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు.
17/27
భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు ఉత్సవ మూర్తులకు అభిషేకం, సుదర్శన మూర్తికి చక్రతీర్థం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు ఉత్సవ మూర్తులకు అభిషేకం, సుదర్శన మూర్తికి చక్రతీర్థం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
18/27
ఉపాసన సీమంతాన్ని దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఉపాసన సీమంతాన్ని దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు.
19/27
కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా రమేశ్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మీటర్‌’. ఏప్రిల్‌ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అతుల్య రవి ఇలా మెరిశారు. కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా రమేశ్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మీటర్‌’. ఏప్రిల్‌ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అతుల్య రవి ఇలా మెరిశారు.
20/27
బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి  పూలమాల వేసి నివాళి అర్పించారు. బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు.
21/27
అల్లుఅర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప.. ది రూల్‌’. ఈ సినిమాకు సంబంధించిన ‘వేర్‌ ఈజ్‌ పుష్ప?’ అనౌన్స్‌మెంట్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఐదు భాషల ఆడియోను ఈ వీడియోకు జత చేసినట్లు తెలిపింది. ఏప్రిల్‌ 7న సాయంత్రం 4.05గంటలకు వేట మొదలు కానుందని తెలుపుతూ పోస్టు పెట్టింది. అల్లుఅర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప.. ది రూల్‌’. ఈ సినిమాకు సంబంధించిన ‘వేర్‌ ఈజ్‌ పుష్ప?’ అనౌన్స్‌మెంట్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఐదు భాషల ఆడియోను ఈ వీడియోకు జత చేసినట్లు తెలిపింది. ఏప్రిల్‌ 7న సాయంత్రం 4.05గంటలకు వేట మొదలు కానుందని తెలుపుతూ పోస్టు పెట్టింది.
22/27
మాస్‌ మహరాజ్‌ రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా థీమ్‌ సాంగ్‌ను బుధవారం సాయంత్రం 5.04గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది, కాగా ఈ సినిమా ఏప్రిల్‌ 7న థియేటర్లలో సినీ ప్రేక్షకులను అలరించనుంది. మాస్‌ మహరాజ్‌ రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమా థీమ్‌ సాంగ్‌ను బుధవారం సాయంత్రం 5.04గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది, కాగా ఈ సినిమా ఏప్రిల్‌ 7న థియేటర్లలో సినీ ప్రేక్షకులను అలరించనుంది.
23/27
అశోక్‌ గల్లా హీరోగా అర్జున్‌ జంద్యాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అశోక్‌ గల్లా జన్మదినం సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌కు సంబంధించిన ఫొటోను చిత్రబృందం ట్విటర్‌ వేదికగా పంచుకుంది. అశోక్‌ గల్లా హీరోగా అర్జున్‌ జంద్యాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అశోక్‌ గల్లా జన్మదినం సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌కు సంబంధించిన ఫొటోను చిత్రబృందం ట్విటర్‌ వేదికగా పంచుకుంది.
24/27
ఇటీవల విడుదలై అందరి మన్ననలను పొందిన ‘బలగం’ సినిమాపై నటుడు మంచు మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్ర దర్శకుడు వేణుని మోహన్‌ బాబు, మంచు విష్టు సహా సత్కరించారు. ఇటీవల విడుదలై అందరి మన్ననలను పొందిన ‘బలగం’ సినిమాపై నటుడు మంచు మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్ర దర్శకుడు వేణుని మోహన్‌ బాబు, మంచు విష్టు సహా సత్కరించారు.
25/27
ఓ షూటింగ్‌లో గాయపడి విశ్రాంతి తీసుకున్న బిగ్‌బీ మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశారు. ఈ ఫొటోలను చూసి అమితాబ్‌ బచ్చన్ అభిమానులు సంబరపడుతున్నారు. ఓ షూటింగ్‌లో గాయపడి విశ్రాంతి తీసుకున్న బిగ్‌బీ మళ్లీ కెమెరా ముందుకు వచ్చేశారు. ఈ ఫొటోలను చూసి అమితాబ్‌ బచ్చన్ అభిమానులు సంబరపడుతున్నారు.
26/27
డా.బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఏపీ ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రి ఆర్కే రోజా, జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డిలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డా.బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా ఏపీ ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రి ఆర్కే రోజా, జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డిలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
27/27
కథానాయిక రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప’ చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్‌ వేదికగా ఓ పోస్టు చేసింది. ‘హ్యాపీ బర్త్‌డే టూ అవర్‌ శ్రీవల్లి’ అంటూ రాసుకొచ్చింది. కథానాయిక రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప’ చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్‌ వేదికగా ఓ పోస్టు చేసింది. ‘హ్యాపీ బర్త్‌డే టూ అవర్‌ శ్రీవల్లి’ అంటూ రాసుకొచ్చింది.

మరిన్ని