News in Pics: చిత్రం చెప్పే సంగతులు-02(02-02-2023)

Updated : 02 Feb 2023 22:32 IST
1/24
విజయవాడలో పాలిటెక్నిక్‌ కళాశాలల స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో పాటు క్యాంప్‌ ఫైర్‌ వేసి ఆడిపాడారు. విజయవాడలో పాలిటెక్నిక్‌ కళాశాలల స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో పాటు క్యాంప్‌ ఫైర్‌ వేసి ఆడిపాడారు.
2/24
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం రాత్రి స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం రాత్రి స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
3/24
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విష్వక్‌సేన వీధిశోధన, తీర్థప్రసాద గోష్ఠి, సామూహిక విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 2 నుంచి 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విష్వక్‌సేన వీధిశోధన, తీర్థప్రసాద గోష్ఠి, సామూహిక విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 2 నుంచి 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
4/24
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో తెలుగు సీరియళ్లకు అవార్డుల ప్రదానం చేశారు. ఇందులో ఈటీవీలో ప్రసారమయ్యే ‘మనసంతా నువ్వే’ను ఉత్తమ సీరియల్‌గా ఎంపిక చేశారు. ఈ పురస్కారాన్ని సీరియల్‌ దర్శకుడు మలినేని రాధాకృష్ణ అందుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో తెలుగు సీరియళ్లకు అవార్డుల ప్రదానం చేశారు. ఇందులో ఈటీవీలో ప్రసారమయ్యే ‘మనసంతా నువ్వే’ను ఉత్తమ సీరియల్‌గా ఎంపిక చేశారు. ఈ పురస్కారాన్ని సీరియల్‌ దర్శకుడు మలినేని రాధాకృష్ణ అందుకున్నారు.
5/24
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో మానేపల్లి జ్యువెల్లర్స్‌ నూతన స్టోర్‌ ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు. కార్యక్రమానికి సినీనటి సలోని, మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌-2022 సాయిలిఖిత యలమంచిలి హాజరై సందడి చేశారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో మానేపల్లి జ్యువెల్లర్స్‌ నూతన స్టోర్‌ ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు. కార్యక్రమానికి సినీనటి సలోని, మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌-2022 సాయిలిఖిత యలమంచిలి హాజరై సందడి చేశారు.
6/24
మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌- 2022 సాయిలిఖిత యలమంచిలి మిస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌- 2022 సాయిలిఖిత యలమంచిలి
7/24
తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దళపతి 67’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమా టైటిల్‌ను శుక్రవారం సాయంత్రం 5గంటలకు ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దళపతి 67’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమా టైటిల్‌ను శుక్రవారం సాయంత్రం 5గంటలకు ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
8/24
కల్యాణ్‌రామ్‌ హీరోగా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమిగోస్‌’. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అమిగోస్‌’ ట్రైలర్‌ను శుక్రవారం సాయంత్రం 5.49గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.. కల్యాణ్‌రామ్‌ హీరోగా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమిగోస్‌’. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అమిగోస్‌’ ట్రైలర్‌ను శుక్రవారం సాయంత్రం 5.49గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది..
9/24
మహేశ్‌బాబు(Mahesh babu) హీరోగా త్రివిక్రమ్‌(Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’(వర్కింగ్ టైటిల్‌). ఈ సినిమా సెట్స్‌లో షూటింగ్‌ విరామ సమయంలో త్రివిక్రమ్ సరదాగా బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మహేశ్‌బాబు(Mahesh babu) హీరోగా త్రివిక్రమ్‌(Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’(వర్కింగ్ టైటిల్‌). ఈ సినిమా సెట్స్‌లో షూటింగ్‌ విరామ సమయంలో త్రివిక్రమ్ సరదాగా బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
10/24
అయోధ్యలోని రామాలయ నిర్మాణం కోసం నేపాల్‌ నుంచి బయల్దేరిన రెండు సాలగ్రామ శిలలు గురువారం అయోధ్యకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆ శిలలకు రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. వీటిని ప్రధాన ఆలయంలో ఏర్పాటుచేసే సీతారాముల విగ్రహాల తయారీకి వినియోగిస్తారని సమాచారం. అయోధ్యలోని రామాలయ నిర్మాణం కోసం నేపాల్‌ నుంచి బయల్దేరిన రెండు సాలగ్రామ శిలలు గురువారం అయోధ్యకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆ శిలలకు రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. వీటిని ప్రధాన ఆలయంలో ఏర్పాటుచేసే సీతారాముల విగ్రహాల తయారీకి వినియోగిస్తారని సమాచారం.
11/24
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో  సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఘనంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో  సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ఘనంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
12/24
మేడారం చిన్న జాతరకు తరలివచ్చిన భక్తులు మేడారం చిన్న జాతరకు తరలివచ్చిన భక్తులు
13/24
అవికా గోర్‌, సాయి రోనక్‌ జంటగా నటించిన చిత్రం ‘పాప్‌ కార్న్‌’. మురళి గంధం దర్శకత్వం వహించారు. పాప్‌కార్న్‌ చిత్రబృందం పర్యటనలో భాగంగా ఏలూరులోని అస్రం మెడికల్ కళాశాలలో విద్యార్థులతో కలిసి చిందులేసి సందడి చేశారు. అవికా గోర్‌, సాయి రోనక్‌ జంటగా నటించిన చిత్రం ‘పాప్‌ కార్న్‌’. మురళి గంధం దర్శకత్వం వహించారు. పాప్‌కార్న్‌ చిత్రబృందం పర్యటనలో భాగంగా ఏలూరులోని అస్రం మెడికల్ కళాశాలలో విద్యార్థులతో కలిసి చిందులేసి సందడి చేశారు.
14/24
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ తన పాలన అద్భుతమని అంటున్నారని.. అదే నిజమైతే తమతో పాదయాత్రకు వచ్చి రుజువు చేయాలన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే, తన పాలనపై నమ్మకం ఉంటే.. ఒక్కరోజు పాదయాత్రకు రావాలని సవాల్ విసిరారు. ఇందుకోసం బూట్లు కూడా పంపిస్తున్నామన్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ తన పాలన అద్భుతమని అంటున్నారని.. అదే నిజమైతే తమతో పాదయాత్రకు వచ్చి రుజువు చేయాలన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే, తన పాలనపై నమ్మకం ఉంటే.. ఒక్కరోజు పాదయాత్రకు రావాలని సవాల్ విసిరారు. ఇందుకోసం బూట్లు కూడా పంపిస్తున్నామన్నారు..
15/24
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ- ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మొదట ఈ- ప్రిక్స్‌ షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం రేసింగ్ కార్ల విడిభాగాలు విమానాశ్రాయానికి తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ- ఛాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మొదట ఈ- ప్రిక్స్‌ షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందు కోసం రేసింగ్ కార్ల విడిభాగాలు విమానాశ్రాయానికి తీసుకొచ్చారు.
16/24
ప్రముఖ సినీనటుడు చిరంజీవి సీనియర్‌ కెమెరామెన్‌ దేవ్‌రాజ్‌కు రూ.5లక్షల ఆర్థిక సహాయం చేశారు. దేవ్‌రాజ్‌ గతంలో చిరంజీవి నటించిన టింగురంగడు, రాణికాసుల రంగమ్మ, నాగు, పులి బెబ్బులి సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేశారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి సీనియర్‌ కెమెరామెన్‌ దేవ్‌రాజ్‌కు రూ.5లక్షల ఆర్థిక సహాయం చేశారు. దేవ్‌రాజ్‌ గతంలో చిరంజీవి నటించిన టింగురంగడు, రాణికాసుల రంగమ్మ, నాగు, పులి బెబ్బులి సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేశారు.
17/24
శ్రీశైలం మహాక్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను దేవస్థానం ప్రతినిధులు ఆహ్వానించారు. శ్రీశైలంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవం ఉంటుందని ఆలయ ప్రతినిధులు గవర్నర్‌కు తెలిపారు. శ్రీశైలం మహాక్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను దేవస్థానం ప్రతినిధులు ఆహ్వానించారు. శ్రీశైలంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవం ఉంటుందని ఆలయ ప్రతినిధులు గవర్నర్‌కు తెలిపారు.
18/24
సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. మూడో టీ20లో న్యూజిలాండ్‌పై 168 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అనంతరం జట్టు సభ్యులంతా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తూ ఇలా పోజిచ్చారు. సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. మూడో టీ20లో న్యూజిలాండ్‌పై 168 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అనంతరం జట్టు సభ్యులంతా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తూ ఇలా పోజిచ్చారు.
19/24
టాలీవుడ్‌ నటుడు కాదంబరి కిరణ్‌ కుమార్తె పూర్ణ సాయి శ్రీ వివాహం వేడుకగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. టాలీవుడ్‌ నటుడు కాదంబరి కిరణ్‌ కుమార్తె పూర్ణ సాయి శ్రీ వివాహం వేడుకగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు.
20/24
న్యూయార్క్‌లోని లింకన్‌ సెంటర్‌లో అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘గో రెడ్‌ ఫర్‌ వుమెన్ రెడ్‌డ్రెస్‌‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మోడల్‌ జింజర్ గొంజగా ఎరుపురంగు దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు. న్యూయార్క్‌లోని లింకన్‌ సెంటర్‌లో అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘గో రెడ్‌ ఫర్‌ వుమెన్ రెడ్‌డ్రెస్‌‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మోడల్‌ జింజర్ గొంజగా ఎరుపురంగు దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు.
21/24
తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ హీరోగా,  లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కొత్త చిత్రం ‘దళపతి 67 (వర్కింగ్‌ టైటిల్‌)’ లాంఛనంగా పట్టాలెక్కింది. త్రిష హీరోయిన్‌. 14 ఏళ్ల తర్వాత విజయ్‌, త్రిష కాంబినేషన్‌లో సినిమా రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ఇలాంటి సమయం కోసం ఎదురు చూస్తున్నవారందరికీ ఇది అంకితం’ అని త్రిష ఓ ఫొటోను ట్వీట్‌ చేశారు. తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ హీరోగా, లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో కొత్త చిత్రం ‘దళపతి 67 (వర్కింగ్‌ టైటిల్‌)’ లాంఛనంగా పట్టాలెక్కింది. త్రిష హీరోయిన్‌. 14 ఏళ్ల తర్వాత విజయ్‌, త్రిష కాంబినేషన్‌లో సినిమా రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ఇలాంటి సమయం కోసం ఎదురు చూస్తున్నవారందరికీ ఇది అంకితం’ అని త్రిష ఓ ఫొటోను ట్వీట్‌ చేశారు.
22/24
సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మైఖేల్‌’. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్‌, సందీప్‌ కిషన్‌ కలిసిన ఓ ఫొటోను చిత్రబృందం ట్వీట్‌ చేసింది. సందీప్‌ కిషన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మైఖేల్‌’. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్‌, సందీప్‌ కిషన్‌ కలిసిన ఓ ఫొటోను చిత్రబృందం ట్వీట్‌ చేసింది.
23/24
మహిళల అండర్‌19 క్రికెట్‌ ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత జట్టులోని తెలంగాణ క్రీడాకారులు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు జి. త్రిష, యశశ్రీ, ఇతర సభ్యులకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. మహిళల అండర్‌19 క్రికెట్‌ ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత జట్టులోని తెలంగాణ క్రీడాకారులు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు జి. త్రిష, యశశ్రీ, ఇతర సభ్యులకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.
24/24

మరిన్ని