News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (02-06-2023)

Updated : 02 Jun 2023 14:55 IST
1/10
సినీ నటి షెర్లీ సేథియా తన తాజా ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటో బాగుందంటూ ఆమె ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. సినీ నటి షెర్లీ సేథియా తన తాజా ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటో బాగుందంటూ ఆమె ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.
2/10
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
3/10
వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం కింద గుంటూరులోని చుట్టుగుంట సర్కిల్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్రాక్టర్‌ నడిపి పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు. వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం కింద గుంటూరులోని చుట్టుగుంట సర్కిల్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ట్రాక్టర్లు, కంబైన్‌ హార్వెస్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్రాక్టర్‌ నడిపి పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు.
4/10
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం స్వామివారికి జ్యేష్ఠాభిషేకాన్ని చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి గోవింద నామస్మరణలో మునిగితేలారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం స్వామివారికి జ్యేష్ఠాభిషేకాన్ని చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి గోవింద నామస్మరణలో మునిగితేలారు.
5/10
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సీఎస్‌ జవహర్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సీఎస్‌ జవహర్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనాలిచ్చారు.
6/10
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేస్తున్న సీఎం కేసీఆర్‌ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేస్తున్న సీఎం కేసీఆర్‌
7/10
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాజపా నాయకులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాజపా నాయకులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
8/10
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్‌భవన్‌లో 1969 తెలంగాణ సాయుధ పోరాటయోధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సత్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్‌భవన్‌లో 1969 తెలంగాణ సాయుధ పోరాటయోధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సత్కరించారు.
9/10
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కళాకారులతో కలిసి నృత్యాలు చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కళాకారులతో కలిసి నృత్యాలు చేశారు.
10/10
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ గన్‌పార్కు వద్ద అమరువీరుల స్తూపానికి నివాళులర్పించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ గన్‌పార్కు వద్ద అమరువీరుల స్తూపానికి నివాళులర్పించారు.
Tags :

మరిన్ని