అమృతజలం...కొబ్బరిసలిలం!..
కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, కాల్షియం, విటమిన్-సి లాంటి బోలెడు పోషకాలుంటాయి. అలాగే తక్కువ మొత్తంలో పిండిపదార్థాలు, పీచూ కూడా. ఈ నీళ్లను తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటాన్ని తగ్గించుకోవచ్చు.
* కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, కాల్షియం, విటమిన్-సి లాంటి బోలెడు పోషకాలుంటాయి. అలాగే తక్కువ మొత్తంలో పిండిపదార్థాలు, పీచూ కూడా. ఈ నీళ్లను తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటాన్ని తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. తాజా కొబ్బరినీళ్లను తరచూ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
* వ్యాయామం చేసిన తర్వాత తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తితోపాటు పోషకాలూ అందుతాయి. ఎండాకాలం అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం కోల్పోయిన నీటిని కొబ్బరి బొండం రూపంలో అందిస్తే డీహైడ్రేషన్ సమస్య ఉండదు.
* బరువు తగ్గాలనుకునేవారికి ఈ నీళ్లు చక్కటి ఎంపిక. ఈ నీటిలో చక్కెరలు, కెలొరీలు తక్కువ కాబట్టి తాగినా బరువు పెరగరు.
* ఈ నీటిని తాగడం వల్ల కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. ఇందులోని పీచు బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
* ఈ నీళ్లలోని పోషకాలు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రిస్తాయి. తరచూ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* వాంతులు, విరోచనాలు అవుతున్నప్పుడు కొబ్బరినీళ్లు తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది. ఈ నీటిని తరచూ తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు తగ్గిపోతాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్