పదును పెట్టి.. తరిగేయొచ్చు!

కూరగాయలు తరిగేందుకు ఒకప్పుడు కత్తిపీటలుండేవి. ఇప్పుడు మాడ్యులర్‌ కిచెన్ల పుణ్యమా అని చాకులకూ, కటింగ్‌ బోర్డులకూ ప్రాధాన్యం పెరిగింది

Published : 25 Jun 2023 01:03 IST

కూరగాయలు తరిగేందుకు ఒకప్పుడు కత్తిపీటలుండేవి. ఇప్పుడు మాడ్యులర్‌ కిచెన్ల పుణ్యమా అని చాకులకూ, కటింగ్‌ బోర్డులకూ ప్రాధాన్యం పెరిగింది. అలాగని ఏదో ఒకటి వాడేద్దామని సరిపెట్టేసుకోలేం. ఇవి సౌకర్యంగా ఉండాలి. పనీ త్వరగా పూర్తవ్వాలి. అలా ఆలోచించే వారికోసమే వచ్చింది ఈ మల్టీ ఫంక్షనల్‌ డబుల్‌ సైడెడ్‌ కటింగ్‌ బోర్డు. దీనికే హ్యాండిల్‌ దగ్గర చాకుకి పదునుపెట్టుకునే సౌకర్యం, వెల్లుల్లి వంటివాటిని నూరుకునే అవకాశం ఉన్నాయి. శుభ్రం చేయడమూ సులువే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని