మస్త్ మస్త్... మటన్!
మటన్ ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. తరవాత పెరుగు, జీలకర్ర, ఉప్పు వేసి కలిపి, మూతపెట్టి సిమ్లో ముక్క మెత్తబడేవరకూ ఉడికించాలి.
కోషా మటన్
కావలసినవి
మటన్ ముక్కలు: అరకిలో, ఆవనూనె: పావుకప్పు, లవంగాలు: నాలుగు, యాలకులు: రెండు, ఉల్లి ముక్కలు: అరకప్పు, అల్లంవెల్లుల్లి: టేబుల్స్పూను, కారం: రుచికి సరిపడా, పసుపు: అర టేబుల్స్పూను, జీలకర్ర: టేబుల్స్పూను, నీళ్లు లేకుండా వడేసిన పెరుగు: అరకిలో, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
* బాణలిలో నూనె వేసి లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి వేయించాలి.
* తరవాత ఉల్లిముక్కలు కూడా వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, పసుపు వేసి వేయించాలి.
* మటన్ ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. తరవాత పెరుగు, జీలకర్ర, ఉప్పు వేసి కలిపి, మూతపెట్టి సిమ్లో ముక్క మెత్తబడేవరకూ ఉడికించాలి.
మటన్ చిల్లీ వేపుడు
కావలసినవి
బోన్లెస్ మటన్: అరకిలో, పచ్చిమిర్చి: ఆరు, వెల్లుల్లి తురుము: 3 టీస్పూన్లు, పసుపు: అరటీస్పూను, యాలకులు: నాలుగు, దాల్చినచెక్క: అంగుళం ముక్క, ఉప్పు: తగినంత, నూనె: 2 టేబుల్స్పూన్లు, ఆవాలు: అరటీస్పూను, కరివేపాకు: 2 రెబ్బలు, అల్లంముక్క: 2 అంగుళాల ముక్క, ఉల్లిపాయలు: రెండు, మిరియాలు: టీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్స్పూన్లు
తయారుచేసే విధానం
* ప్రెషర్ కుక్కర్లో మటన్, టీస్పూను వెల్లుల్లి తురుము, పసుపు, యాలకులు, దాల్చినచెక్క, నాలుగు కప్పుల నీళ్లు పోసి ఐదారు విజిల్స్ రానివ్వాలి.
* పూర్తిగా చల్లారిన తరవాత అందులోని యాలకులు, దాల్చినచెక్క పక్కకు తీసి నీళ్లు కూడా వంపి ఓ పక్కగా ఉంచాలి. అల్లం పొట్టు తీసి పలుచగా తరిగినట్లుగా కోయాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు వేసి వేగాక, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, మిగిలిన వెల్లుల్లి తురుము, అల్లం ముక్కలు వేసి మంచి వాసన వచ్చేవరకూ వేయించాలి. ఇప్పుడు ఉల్లిముక్కలు కూడా వేసి వేగాక మటన్ ముక్కలు వేసి కలపాలి. కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, ఉప్పు వేసి కలపాలి. తరవాత మటన్ ఉడికించిన నీళ్లను పోసి అవన్నీ ఆవిరైపోయేవరకూ ఉడికించి చివరగా కొత్తిమీర తురుము చల్లి దించాలి.
కట్టా మటన్
కావలసినవి
మటన్: పావుకిలో, ఆవనూనె: 2 టేబుల్స్పూన్లు, దాల్చినచెక్క: అర అంగుళం ముక్క, జీలకర్ర: ఒకటిన్నర టీస్పూన్లు, లవంగాలు: రెండు, యాలకులు: రెండు, ఉల్లిపాయలు: నాలుగు, వెల్లుల్లి ముద్ద: 3 టీస్పూన్లు, అల్లంముద్ద: 2 టీస్పూన్లు, కసూరిమెంతి: 2 టీస్పూన్లు, పసుపు: ఒకటిన్నర టీస్పూన్లు, ఉప్పు: తగినంత, కశ్మీరీ మసాలా: టీస్పూను, ఎండుమిర్చి: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, ఆమ్చూర్ పొడి: రెండున్నర టీస్పూన్లు
తయారుచేసే విధానం
* బాణలిలో నూనె వేసి కాగాక దాల్చినచెక్క, జీలకర్ర, లవంగాలు, యాలకులు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత అల్లం, వెల్లుల్లి ముద్దలు వేసి వేగాక కసూరి మెంతి, పసుపు, ఉప్పు, కశ్మీరీ మసాలా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఓ నిమిషం వేయించాక కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. తరవాత మటన్ ముక్కలు వేసి పది నిమిషాలు ఉడికిన తరవాత మరో 2 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. ఇప్పుడు మూతపెట్టి మీడియం మంటమీద ముక్క మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. తరవాత ఆమ్చూర్ పొడి కలిపి చివరగా కొత్తిమీర తురుము చల్లితే సరి.
బెండకాయ మటన్
కావలసినవి
బోన్లెస్ మటన్: ముప్పావుకిలో, బెండకాయలు: పావుకిలో, టొమాటోలు: నాలుగు, ఉల్లిపాయలు: రెండు, అల్లంవెల్లుల్లి: టేబుల్స్పూను, ఉప్పు: తగినంత, దనియాలపొడి: 2 టీస్పూన్లు, గరంమసాలా: 2 టీస్పూన్లు, కారం: 4 టీస్పూన్లు, దాల్చినచెక్క: 2 అంగుళాల ముక్క, పలావు ఆకులు: రెండు, యాలకులు: రెండు, లవంగాలు: 12, నూనె: 6 టేబుల్స్పూన్లు
తయారుచేసే విధానం
* బెండకాయల్ని కడిగి తడి లేకుండా తుడిచి ముక్కలుగా కోయాలి.
* టొమాటోల్నీ ఉల్లిపాయల్నీ తురిమినట్లుగా సన్నని ముక్కలుగా కోయాలి.
* బాణలిలో నూనె వేసి ఉల్లిముక్కలు వేయించాలి. తరవాత దాల్చినచెక్క ముక్కలు, లవంగాలు, పలావు ఆకులు, యాలకులు వేసి వేగనివ్వాలి. అల్లంవెల్లుల్లి కూడా వేసి వేగాక మటన్ ముక్కలు, ఉప్పు వేసి పది నిమిషాలు ఉడికించాలి.
* కారం, దనియాలపొడి వేసి ఓ రెండు నిమిషాలు ఉడికించాక టొమాటో ముక్కలు వేసి నూనె బయటకు వచ్చేవరకూ వేగనివ్వాలి. ఇప్పుడు ఈ కూర మిశ్రమాన్ని మొత్తంగా కుక్కర్లో వేసి సుమారు ఆరు కప్పుల నీళ్లు పోసి, గరంమసాలా కూడా వేసి మూతపెట్టి ఐదారు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించాలి. తరవాత బెండకాయ ముక్కలు కూడా వేసి అవి ఉడికేవరకూ సిమ్లో సుమారు అరగంటసేపు ఉడికించి దించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు