Viral Video: 24 అంతస్తుల భవనం ఎలా కాలిపోతోందో చూడండి!
టర్కీలోని ఇస్తాంబుల్లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫికిర్టీప్ ప్రాంతంలోని ఓ 24 అంతస్తుల భవనం పాక్షికంగా దగ్ధమైంది. నిమిషాల్లోనే 24 అంతస్తుల భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అంకారా: టర్కీలోని ఇస్తాంబుల్లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫికిర్టీప్ ప్రాంతంలోని ఓ 24 అంతస్తుల భవనం పాక్షికంగా దగ్ధమైంది. మొదటి అంతస్తులో ఏర్పడిన మంటలు నిమిషాల్లోనే భవనం చివరి వరకు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలపివేశారు. చుట్టుపక్కల భవన సముదాయాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ప్రత్యేక బృందాలతో ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తామని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇగోర్ సుష్కో అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం