Viral Video: చదువుకోనంటున్న బుడతడు.. కారణం తెలిస్తే నవ్వు ఆగదు!
చదువుకోనంటూ ఓ బాలుడు తల్లి వద్ద మారాం చేస్తున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. అయితే, చదువుకోను అనేందుకు అతడు చెప్పిన కారణం నెట్టింట నవ్వులు పూయిస్తోంది........
ఇంటర్నెట్ డెస్క్: తాను చదువుకోనంటూ ఓ బుడతడు తల్లి వద్ద మారాం చేస్తున్న వీడియో ఒకటి సెట్టింట వైరల్గా మారింది. ఏడుస్తూ తాను చదువుకోనంటూ తల్లికి చెబుతోన్న ఆ వీడియో నవ్వులు పూయిస్తోంది. ఇలా చదువుకుంటూపోతే తాను ముసలోడినైపోతానంటూ ఆ బాలుడు అనడమే ఇందుకు కారణం. ‘జీవితాంతం చదువుతూ చదువుతూ ముసలోడినైపోతా’ అంటూ ఏడుస్తూ తల్లికి చెబుతుండగా.. ‘క, ఖ, గ, ఘలు చదివితేనే వృద్ధుడివవుతావా?’ అంటూ ఆమె ప్రశ్నించింది. కాగా అతడు మరోసారి అదే సమాధానం చెప్పడం గమనార్హం.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇప్పటికే 5లక్షల మందికి పైగా వీక్షించారు. నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అతడు చెప్పే విధానం నవ్వు తెప్పిస్తోందని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ‘ఆ పిల్లవాడు చెప్పేది నిజమేనని మేం అలా చదువుతూనే వృద్ధులం అయిపోయాం’ అంటూ ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. ‘బాగుంది.. కానీ బాధగా ఉంది. ఇప్పటి పిల్లలపై ఎంతో వర్క్లోడ్. విద్యావ్యవస్థలో మార్పులు అవసరం. పిల్లలు పాఠశాలలకు ఆనందంగా స్కూళ్లకు వెళ్లేలా తగిన మార్పులు చేయాల్సి ఉంది’ అని మరొకరు పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం