Andhra News: విశాఖ అంటే జగన్కు ఎనలేని ప్రేమ: అవంతి శ్రీనివాస్
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రాష్ట్రమంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ సర్క్యూట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
విశాఖపట్నం: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రాష్ట్రమంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ సర్క్యూట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చాలా మంది రాజధాని ఆగిపోయిందని ప్రచారం చేస్తున్నారని, అమరావతి అక్కడే ఉంటుందన్నారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటూనే, మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే తప్పేముందని ప్రశ్నించారు. కర్ణాటక, ఝార్ఖండ్ సీఎంలు కూడా 3 రాజధానులు పెట్టాలని అనుకుంటున్నారని తెలిపారు. ఇక్కడి ప్రజలు సౌమ్యులు, మంచివాళ్లు అందుకే విశాఖ అంటే సీఎం జగన్కు ఎనలేని ప్రేమ, అభిమానం ఉందన్నారు.
‘‘జిల్లా విభజన పరిపాలన వికేంద్రీకరణకు సౌకర్యంగా ఉంటుంది. జనాభా పరంగా మూడో పెద్ద జిల్లా విశాఖ. జిల్లాల వారీగా విభజన కావడం వల్ల సౌకర్యాలు వస్తాయి. జిల్లాల విభజన విషయంలో నటుడు బాలకృష్ణ హిందూపురం జిల్లా కావాలని కోరారు. రాష్ట్రం ఎక్కువ అప్పులు చేసిందని భాజపా నేతలు అంటున్నారు. కేంద్రం అప్పులు చేయకుండానే దేశాన్ని పాలిస్తోందా?. భాజపా పాలిత రాష్ట్రాల మీదే ప్రేమ చూపకుండా మిగిలిన రాష్ట్రాలవైపు కూడా చూడాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలనే ఆలోచన మానుకోవాలి’’ అని అవంతి శ్రీనివాస్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?