Flood: వరదపోటు
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో కురిసిన భారీవర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెన్నై-కోల్కతా జాతీయ రహదారి సహా పలు మార్గాల్లో రాకపోకలకు తీవ్రంగా
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వాగులు ఉప్పొంగి స్తంభించిన రాకపోకలు
కండలేరు ఉద్ధృతికి హైవే జలదిగ్బంధం
ఈనాడు డిజిటల్-ఒంగోలు, నెల్లూరు, గూడూరు- న్యూస్టుడే: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో కురిసిన భారీవర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెన్నై-కోల్కతా జాతీయ రహదారి సహా పలు మార్గాల్లో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ప్రకాశం జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల్లో వరద ప్రభావం అధికంగా ఉంది. నెల్లూరు జిల్లా నుంచి సోమశిల జలాశయం ద్వారా లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు జలాశయానికి 37 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ రిజర్వాయర్ను 16 అడుగుల వరకు నింపి.. 5 గేట్ల ద్వారా 48 వేల క్యూసెక్కుల నీటిని దిగువనున్న మన్నేరుకు వదిలారు. ఈ నీటితో కందుకూరు- గుడ్లూరు మధ్య మాచవరం సమీపంలో రాకపోకలు నిలిచాయి. పామూరు మండలంలో రెండు రోజుల వ్యవధిలో 177 మిల్లీమీటర్లు, సీఎస్పురంలో 109, వెలిగండ్లలో 102 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. పామూరు పాతచెరువు అలుగు పొంగి.. కట్ట కొంతమేర కోసుకుపోయింది. జేసీ వెంకటమురళి ఆధ్వర్యంలో నీటిపారుదలశాఖ అధికారులు ఇసుక, కంకర బస్తాలు వేసి కట్ట మరమ్మతులు చేపట్టారు. గోపాలపురం ఎస్సీకాలనీ వద్ద 565 జాతీయ రహదారికి ఇరువైపులా నీరు నిలిచి ఇళ్లలోకి చేరింది. రహదారి మధ్యలో పొక్లైయిన్తో తవ్వి పైపులు వేసి బయటకు తోడిపోస్తున్నారు. పామూరు నుంచి కనిగిరి, కందుకూరు, ఉదయగిరి, నెల్లూరు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు పొంచి ఉన్న ఇనిమెర్ల, నుచ్చుపొద గ్రామాల ప్రజలను స్థానిక పాఠశాల భవనాల్లోకి తరలిస్తున్నారు. పీసీపల్లి మండలంలోని బట్టుపల్లి వద్ద పాలేరు, తలకొండపాడు వాగులు, రాచర్ల మండలం పలకవీడు వద్ద ఉప్పువాగు పొంగాయి. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసు సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని ప్రకాశం ఎస్పీ మలికా గార్గ్ ఆదేశించారు.
గూడూరు శివారులో స్తంభించిన వాహనాలు
నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో హైవే చుట్టూరా వరద నీరు చేరి.. ఆ మార్గంలో వాహనాలు స్తంభించిపోయాయి. ఇక్కడ చెన్నై-కోల్కతా (ఎన్హెచ్-16)పై కొత్త వంతెనలు నిర్మిస్తుండటంతో కొన్నాళ్లుగా వాహనాలను డైవర్షన్ రోడ్డులో మళ్లిస్తున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కండలేరు సహా స్థానిక వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. డైవర్షన్ రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. ఐదు అడుగుల మేర వరద పోటెత్తడంతో దారి కనిపించలేదు. సోమవారం రాత్రి నుంచే రాకపోకలు నిలిపివేశారు. గూడూరు నుంచి అటూఇటూ సుమారు 25 కిలోమీటర్ల మేర వాహనాలు మూడు వరుసల్లో నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు, డీటీసీ చందర్, గూడూరు సబ్డివిజనల్ అధికారులు వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారు.
ప్రయాణికుల ఆహాకారాలు
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు వాహనాల్లోనే ఉండి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చుట్టూరా నీరే ఉండటంతో కిందకు దిగేందుకూ వీలుకాలేదు. మంచినీరు, ఆహారం దొరక్క నానాయాతన అనుభవించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ సుమారు 10 గంటల పాటు వాహనాల్లోనే గడిపారు. తర్వాత కార్లు, బస్సులను పొదలకూరు, వెంకటగిరి, పోర్టు రోడ్డు మార్గంలో పంపించారు. టోల్ ఫీజు మాత్రం యథాతథంగా వసూలు చేశారు. మరోపక్క, హైవే నిర్మాణ పనుల్లో జాప్యం చర్చనీయాంశమైంది. వంతెనల నిర్మాణం ఏడేళ్లయినా పూర్తిచేయలేదు. 2015లో వరదలకు గూడూరు- నెల్లూరు మధ్య రోడ్డు కొట్టుకుపోగా, ఇప్పటికీ అక్కడ బ్రిడ్జి నిర్మాణం పూర్తికాలేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి సీఎం చంద్రబాబు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలిచ్చినా పురోగతి లోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!