
AP News: రూ.10తో పంటల బీమా
ఖరీఫ్ నుంచి అమలు
పెట్టుబడి రాయితీ అందకపోతే మళ్లీ నమోదు చేసుకోవచ్చు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
ఈనాడు, అమరావతి: వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమల్లో భాగంగా ఖరీఫ్ నుంచి ప్రతి రైతు దగ్గర రూ.10 చొప్పున తీసుకుని సంతకం చేసిన రశీదు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ‘ఆర్బీకేల్లో ప్రదర్శించిన ధరలు దక్కకపోతే అక్కడి రైతులు.. వ్యవసాయ సహాయకుడి ద్వారా సీఎం యాప్లో నమోదు చేసుకోవచ్చు. దీంతో మార్కెటింగ్ శాఖ, సంయుక్త కలెక్టర్ జోక్యం చేసుకుని రైతుకు తోడుగా నిలుస్తారు. కనీస గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది’ అని చెప్పారు. 2021 నవంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన 5.97 లక్షల మంది రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.542 కోట్ల పెట్టుబడి రాయితీని ఆయన మంగళవారం క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. 1,220 సీహెచ్సీలకు సంబంధించి ఆయా సంఘాలకు రాయితీగా రూ.29.51 కోట్లు, 2020 ఖరీఫ్ పంటల బీమాకు సంబంధించిన పెండింగ్ మొత్తం రూ.93 కోట్లనూ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ-పంట సమాచారం ఆధారంగా గ్రామస్థాయిలోని ఆర్బీకేల్లో జాబితా ప్రదర్శించి పెట్టుబడి రాయితీ ఇస్తున్నాం. కౌలు రైతులతో సహా అందరికీ అందేలా చూస్తున్నాం. ఎవరి పేరైనా జాబితాలో లేకపోతే మళ్లీ నమోదు చేసుకోవచ్చు’ అని చెప్పారు. ‘తెదేపా హయాంలో 2015లో కురిసిన వర్షాలకు, 2018 ఖరీఫ్లో కరవుతో నష్టపోయిన రైతులకు పరిహారం ఎగ్గొట్టారు’ అని విమర్శించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయశాఖను మూసేస్తే.. తిరిగి తెరిచిన ఘనత జగన్మోహన్రెడ్డిదే అని రైతులు గుర్తించారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
Crime News
Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
-
General News
Harsh Goenka: బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో గోయెంకా, శిందే.. అసలు విషయం ఏంటంటే..?
-
Politics News
Telangana News: భాజపాలోకి హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- PV Sindhu: ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ
- Shruti Haasan: ఆ వార్తలు నిజం కాదు.. శ్రుతిహాసన్
- IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు
- Social Look: టాంజానియాలో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ముంబయిలో తమన్నా జర్నీ!