Aryan Khan: డ్రగ్స్ కేసులో షారుక్ తనయుడి అరెస్ట్
రేవ్ పార్టీ ముసుగులో మాదకద్రవ్యాల మత్తులో జోగుతున్న సంపన్నవర్గాల వారసులను మహారాష్ట్ర ఉన్నతాధికారులు అరెస్టు చేశారు. సముద్ర జలాలపై విహరిస్తూ విచ్చలవిడిగా
విహారనౌకలో రేవ్ పార్టీ భగ్నం
ప్రయాణికుల్లా వెళ్లిన అధికారులు
మాదకద్రవ్యాల స్వాధీనం
ఆర్యన్ఖాన్, మరో ఏడుగురి అరెస్టు
బాలీవుడ్ లింకులు బయటకు తీస్తామన్న ఎన్సీబీ
ముంబయి, దిల్లీ, పణజీ: రేవ్ పార్టీ ముసుగులో మాదకద్రవ్యాల మత్తులో జోగుతున్న సంపన్నవర్గాల వారసులను మహారాష్ట్ర ఉన్నతాధికారులు అరెస్టు చేశారు. సముద్ర జలాలపై విహరిస్తూ విచ్చలవిడిగా సాగిస్తున్న అకృత్యాలకు పకడ్బందీ వ్యూహంతో కళ్లెం వేశారు. శనివారం రాత్రి ముంబయి నుంచి గోవా వెళ్తున్న ఓడలో ఏర్పాటుచేసిన రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు జరిపిన దాడిలో బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ (23) సహా మరో ఏడుగురు అరెస్టయ్యారు. ఈ పార్టీలో కొంతమంది దుస్తుల్లో దాచుకొన్న ఎక్స్టసీ, కొకెయిన్, మఫెడ్రోన్ (ఎండీ), చరస్ వంటి మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు యువతులతోపాటు అదుపులోకి తీసుకున్న బృందంలో మూన్మూన్ ధామేచ, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రా, ఆర్యన్ఖాన్, అర్బాజ్ మర్చంట్ ఉన్నారు. వీరందరికీ అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా ఆర్యన్ఖాన్, మూన్మూన్ ధామేచ, అర్బాజ్ మర్చంట్లను రిమాండు నిమిత్తం ఆదివారం స్పెషల్ హాలిడే కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ ముగ్గురూ సోమవారం దాకా ఎన్సీబీ కస్టడీలో ఉండేలా కోర్టు ఆదేశించింది. తన క్లయింటు రేవ్ పార్టీ నిర్వాహకుల ఆహ్వానం మేరకే అక్కడికి వెళ్లాడని, డ్రగ్స్ తీసుకోలేదని ఆర్యన్ఖాన్ తరఫు న్యాయవాది వాదించారు. దాడిలో పట్టుబడిన మిగతా అయిదుగురినీ సోమవారం కోర్టులో హాజరుపరుస్తారు.
* సంగీత హోరులో సముద్ర ప్రయాణం
ఓ టీవీ ఛానల్ భాగస్వామిగా నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో సంగీత హోరు నడుమ రెండు రోజుల సముద్ర ప్రయాణం ఏర్పాటు చేశారు. అక్టోబర్ 2 - 4 తేదీల మధ్య ఉంటుందని ప్రకటించారు. వంద టికెట్లను మాత్రమే విక్రయానికి ఉంచి, మిగిలినవి నిర్వాహకులే అమ్మారు. సంపన్నులు ఎగబడ్డ ఈ పార్టీ కోసం చాలామంది టికెట్లు కొని కూడా ఓడ ఎక్కలేకపోయారు. ఓ మహిళ రూ.82 వేలు చెల్లించినా షిప్ నిండిపోయిందంటూ ఆమెను వెనక్కు పంపారు. ఈ ఓడ ప్రయాణికులు సామర్థ్యం 1,800. ఇటువంటి పార్టీల్లో ముఖ్యంగా ఎండీఎంఏ అనే సింథటిక్ డ్రగ్స్ను వినియోగిస్తుంటారు.
* సమీర్ వాంఖెడె నేతృత్వంలో..
సమర్థుడైన అధికారిగా పేరున్న జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె నేతృత్వంలో 22 మంది ఎన్సీబీ అధికారులు ప్రయాణికుల్లా నటిస్తూ ఓడ ఎక్కారు. సముద్రం మధ్యలోకి ఓడ వెళ్లిన తర్వాత పార్టీ మొదలైంది. అదను చూసి అధికారులు దాడికి దిగారు. కాగా, ఈ సంఘటనతో తమకెలాంటి సంబంధం లేదని.. అధికారులతో పూర్తిగా సహకరిస్తామని గోవాకు చెందిన ఓడ కంపెనీ ప్రకటించింది. గత కొన్నిరోజులుగా దేశంలో మాదకద్రవ్యాల ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. సెప్టెంబరులో గుజరాత్లోని ముంద్రా ఓడరేవులో భారీగా 3 వేల కిలోల హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే. దిల్లీ, నోయిడాల్లోనూ 37 కిలోల మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. ముంబయిలోనూ సమీర్ వాంఖెడె బృందం గత రెండేళ్లలో మొత్తం రూ.17,000 కోట్ల డ్రగ్స్ పట్టుకుంది.
* హీరోగా వస్తాడనుకుంటే..
బాలీవుడ్ హీరోగా జనం ముందుకొచ్చే దశలో కుమారుడు ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం షారుక్ కుటుంబాన్ని కలవరపాటుకు గురిచేసింది. నటి దీపికా పదుకొణెతో కలిసి నటిస్తున్న ‘పఠాన్’ చిత్రం పాట చిత్రీకరణ కోసం స్పెయిన్ వెళ్లాల్సిన షారుక్ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎప్పటికప్పుడు కేసు పురోగతి గురించి తెలుసుకొంటూ, న్యాయవాదితో సంప్రదింపులు జరుపుతూ గడిపారు. ఆర్యన్ఖాన్ తల్లి గౌరీఖాన్ కూడా కుమారుడి అరెస్టు గురించి విని కుంగిపోయారు. విదేశాల్లో చదివి, తైక్వాండోలో బ్లాక్బెల్ట్ సాధించిన ఆర్యన్ మీడియాకు దూరంగా ఉంటున్నా.. ఇన్స్టాలో 14 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం.
* ‘ముంద్రా’ దృష్టి మళ్లించేందుకే: కాంగ్రెస్
ముంద్రా ఓడరేవులో భారీగా పట్టుబడ్డ హెరాయిన్ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఎన్సీబీ తాజా దాడి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ముంద్రా ఉదంతంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ మీడియాతో మాట్లాడుతూ.. సొంత రాష్ట్రంలో బయటపడిన డ్రగ్స్ గురించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా మౌనం వీడాలన్నారు.
* పిల్లాడు.. ఊపిరి తీసుకోనీ : సునీల్శెట్టి
‘కేసును అధికారులు విచారిస్తారు. ఆ పిల్లాడిని కాస్త ఊపిరి తీసుకోన్విండి’ అంటూ బాలీవుడ్ నటుడు సునీల్శెట్టి మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఆర్యన్ఖాన్ అరెస్టుపై ఆయన స్పందిస్తూ.. ‘వాస్తవాలు బయటికి రానివ్వండి. బాధ్యతగా వ్యవహరిద్దాం’ అన్నారు.
‘‘మేము అరెస్టు చేసిన వారికి మత్తు పదార్థాలు విక్రయించేవారితో సంబంధాలు ఉన్నాయి. కావాలంటే వాట్సప్ సంభాషణల వంటి సాక్ష్యాలు చూపగలం. ఈ కేసు ఆధారంగా మత్తు పదార్థాల వ్యాపారులతో బాలీవుడ్కు ఉన్న సుదీర్ఘ సంబంధాలను వెలికితీసే ప్రయత్నం చేస్తాం’’
మత్తుపదార్థాల నియంత్రణ దళం(ఎన్సీబీ)
ఇలా చెబితే రెచ్చిపోరా!
‘నా కొడుకు అమ్మాయిలతో డేటింగ్ చేయొచ్చు. సిగరెట్ తాగొచ్చు. సెక్స్, డ్రగ్స్ను కూడా ఆస్వాదించవచ్చు. అన్నిరకాలుగా అతను ఎంజాయ్ చేయవచ్చు’.. గతంలో షారుక్ఖాన్ తన కుమారుడు ఆర్యన్ గురించి సరదాగా చేసిన ఈ కామెంట్లు ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పరిస్థితులు సహకరించక గతంలో తాను కోల్పోయిన యవ్వన సరదాలు తన పిల్లలు కోల్పోరాదని సగటు తండ్రిలా ఆలోచించడం తప్పు కాదు. ఆ సరదాలు మరీ ఇలా విచ్చలవిడిగా ఉంటే జరిగేది అనర్థమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్