Manipur Election Results 2022: మణిపురాధీశులు కమలనాథులే!
మణిపుర్ శాసనసభ ఎన్నికలలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన భాజపా ఘన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. గత ఎన్నికలలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్
పక్కా ప్రణాళికతో భాజపా ఘన విజయం
ఈనాడు, గువాహటి: మణిపుర్ శాసనసభ ఎన్నికలలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన భాజపా ఘన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టబోతోంది. గత ఎన్నికలలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ ఈసారి పూర్తిగా చతికిలపడింది. మొత్తం 60 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన భాజపా 32 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఈసారి ఆరు స్థానాలు సాధించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి ఏడు, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు ఐదు సీట్లు దక్కాయి. కుకీ పీపుల్స్ పార్టీ అలయెన్స్ (కేపీఏ) రెండు, స్వతంత్రులు మూడు సీట్లను సాధించారు. 2002 నుంచి 2017 వరకూ వరుసగా మూడుసార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ దఫా ఐదు సీట్లకే పరిమితమైంది. సీపీఐ, సీపీఎం, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్, జనతాదళ్ (సెక్యులర్) పొత్తు పెట్టుకున్నప్పటికీ ‘హస్తం’ పార్టీకి కలిసిరాలేదు.
2017లో జరిగిన మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 28 స్థానాలు రాగా భాజపాకు 21 మాత్రమే వచ్చాయి. ఎన్పీపీ, ఎపీఎఫ్ తోడ్పాటుతో కమలం పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తాజా ఎన్నికలకు ముందు విభేదాలు రావడంతో భాజపా సొంతంగానే అన్ని స్థానాల్లో పోటీ చేసింది. భాజపా ఓట్ల శాతం 37.8కి పెరిగింది. కాంగ్రెస్ మాత్రం 16.8 శాతంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.
ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ హెయిన్గాంగ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై 18,271 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున మాజీ సీఎం ఇబోబీ సింగ్ విజయం సాధించారు.
పల్లెలకు వెళ్లి... పర్వతాలు ఎక్కి...
రాజకీయ చాణక్యం ప్రదర్శించడంతోపాటు గత అయిదేళ్లలో ప్రజలలోకి విస్తృతంగా వెళ్లేందుకు భాజపా నాయకులు ప్రయత్నించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వాములు రచ్చచేస్తున్నా సంయమనంతో వ్యవహరించి అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి బీరేన్సింగ్ దృష్టి సారించారు. గ్రామాలకు వెళదాం (గో టు విలేజస్), కొండలకు వెళదాం (గో టు హిల్స్) వంటి ప్రణాళికల ద్వారా ఆయన జనానికి చేరువయ్యేందుకు ప్రయత్నించారు. ఒక్క ఎన్కౌంటర్ కూడా జరగకుండా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టానికి విలువ లేకుండా చేశామని పార్టీ నాయకులు ప్రకటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి రథం జంట ఇంజన్ల మీద పరుగులు తీస్తుందన్న మోదీ ప్రచారం భాజపాకు కలిసొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.
జర్నలిస్టు నుంచి సీఎం వరకు..
ఇంఫాల్: మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్సింగ్.. జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత రాజకీయాల్లో చేరి అంచలంచెలుగా ఎదిగారు. 1992లో ‘నహరోల్జి తౌడాంగ్’ అనే వార్తా పత్రికను ప్రారంభించి 2001 వరకు ఎడిటర్గా పనిచేశారు. ఆ గుర్తింపుతోనే 2002లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత డెమొక్రటిక్ రెవల్యూషనరీ పీపుల్స్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది కాంగ్రెస్లోకి వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. స్వల్ఫకాలంలోనే ఇబోబి సింగ్కు అత్యంత సన్నిహితుడిగా మారారు. 2002 నుంచి 2016 వరకు కాంగ్రెస్ హయాంలో పలు కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూశారు. 2016లో కాంగ్రెస్తో విబేధించి భాజపాలో చేరారు. 2017 ఎన్నికల్లో ఎన్పీపీ, ఎన్పీఎఫ్, ఎల్జేపీ, టీఎంసీల భాగస్వామ్యంతో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2020లో పార్టీలో ఆయనపై వ్యతిరేకత బహిర్గతమైనప్పటికీ రాజకీయ చతురతతో సద్దుమణిగేలా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM