Andhra News: డిస్కంలు చెల్లించాల్సింది.. రూ.9వేల కోట్లు!
పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారమే యూనిట్ ధరను చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో విద్యుత్ సంస్థలు వడ్డీతో కలిపి సుమారు రూ.9వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని అధికారులు
పునరుత్పాదక విద్యుత్ సంస్థలకు కట్టాల్సిందే
ఈనాడు, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారమే యూనిట్ ధరను చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో విద్యుత్ సంస్థలు వడ్డీతో కలిపి సుమారు రూ.9వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న పీపీఏల ధరలు ఎక్కువగా ఉన్నాయని.. వాటిని పునఃసమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారంలో కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులను పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థల నిర్వాహకులు కోర్టులో సవాలు చేశారు. కేసు విచారణలో భాగంగా తుదితీర్పు వెల్లడించే వరకూ పవన విద్యుత్కు యూనిట్కు రూ.2.43, సౌర విద్యుత్కు రూ.2.44 వంతున చెల్లించాలని డిస్కంలను కోర్టు ఆదేశించింది. డిస్కంలు అలాగే చెల్లిస్తున్నాయి. పీపీఏ ప్రకారం పూర్తి మొత్తాన్ని విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిందేనని హైకోర్టు తుదితీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డిస్కంలు భావిస్తున్నాయి.
మొత్తం 7,400 మెగావాట్లు
ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పీపీఏల ధరలను సమీక్షించనున్నట్లు ప్రకటించింది. పవనవిద్యుత్ 3,900 మెగావాట్లు, సౌర విద్యుత్కు సంబంధించి 3,500 మెగావాట్లకు సంబంధించిన 264 పీపీఏలను సమీక్షించాలని నిర్ణయించింది. వారికి నోటీసులు జారీచేసింది. ఇందులో పవన విద్యుత్ పీపీఏలు 220, సౌరవిద్యుత్ పీపీఏలు 44 ఉన్నాయి. పీపీఏ ప్రకారం పవన విద్యుత్కు యూనిట్కు రూ.4.84 వంతున, సౌర విద్యుత్కు యూనిట్కు గరిష్ఠంగా రూ.6.49 నుంచి 5.70 వరకు చెల్లించాలి. యూనిట్ రూ.5.70 ధరకు కుదుర్చుకున్న పీపీఏలు సుమారు 2వేల మెగావాట్ల వరకు ఉన్నాయి. సౌర విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏ నిబంధన ప్రకారం ఏటా యూనిట్ ధరను 3% పెంచాలి. ఈ ప్రకారం ప్రస్తుతం కొన్ని పీపీఏలకు యూనిట్కు రూ.7.15 వంతున డిస్కంలు చెల్లించాలి. 264 పీపీఏల ద్వారా ఏటా సుమారు 15 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ డిస్కంలకు అందుతుంది.
చెల్లించాల్సింది 2018 జూన్ నుంచి..
పీపీఏల వివాదంపై తుదితీర్పు వచ్చేవరకూ కోర్టు నిర్దేశించిన ధరల ప్రకారం విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాలని 2019 సెప్టెంబరు 24న డిస్కంలను ఆదేశించింది. అప్పటివరకూ ఉన్న బకాయిలకూ ఇదే టారిఫ్ వర్తిస్తుందని పేర్కొంది. దీని ప్రకారం పునరుత్పాదక విద్యుత్ సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్కు 2018 జూన్ నుంచి డిస్కంలు చెల్లించాలి. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం డిస్కంలు చెల్లించాయి. ప్రస్తుత తీర్పుతో 2018 జూన్ నుంచి పీపీఏ ధరల ప్రకారం చెల్లించాలి. ఈ లెక్కన సుమారు రూ.7,500 కోట్లు.. 9% వడ్డీ కలిపి చెల్లించాలి. ఈ రూపేణా సుమారు రూ.1,500 కోట్లు అవుతుందని అంచనా. పీపీఏ వివాదంపై కోర్టును ఆశ్రయించిన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు 2021 జనవరి నుంచి, మిగిలిన వాటికి 2021 జూన్ నుంచి తీసుకున్న విద్యుత్కు చెల్లించాల్సిన మొత్తాన్ని డిస్కంలు పూర్తిగా నిలిపేశాయి. విద్యుత్సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్