MLC Ananthababu: అరెస్టుపై ఇంత తాత్సారమా?
రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే చాలు వారు ఎక్కడున్నా వెతికి, వెంటాడి మరీ అరెస్టు చేస్తున్న పోలీసులు.. దళిత యువకుడు వీధి సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన.....
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో పోలీసులపై తీవ్ర విమర్శలు
నిరసనలు వెల్లువెత్తడంతో 4 రోజుల తర్వాత అదుపులోకి..
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే చాలు వారు ఎక్కడున్నా వెతికి, వెంటాడి మరీ అరెస్టు చేస్తున్న పోలీసులు.. దళిత యువకుడు వీధి సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు విషయంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనబరిచారు. ప్రతిపక్ష పార్టీలు, దళిత, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలతో ఉద్యమిస్తే తప్ప అదుపులోకి తీసుకోలేదు. తమవాడిని ఎమ్మెల్సీ అనంతబాబే చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారంటూ సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు తొలి నుంచి ఆరోపించినా పోలీసులు పట్టించుకోలేదు. హత్య జరిగిన మర్నాడు ఎమ్మెల్సీ వివాహాలు, శుభకార్యాలకు తిరుగుతున్నా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగు రోజుల తర్వాత సోమవారం అరెస్టు చేశారు. అనంతబాబుకు తగినంత సమయం ఇవ్వడానికే అరెస్టు విషయంలో పోలీసులు తాత్సారం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.'
ఎమ్మెల్సీ అనంతబాబువద్ద గతంలో డ్రైవర్గా పనిచేసిన సుబ్రమణ్యం ఈ నెల 19న రాత్రి హత్యకు గురయ్యారు. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి బాధిత కుటుంబ సభ్యుల్ని నమ్మించేందుకు ఎమ్మెల్సీ ప్రయత్నించారు. తమవాడిని అనంతబాబే చంపేశారని అదే రోజు మృతుడి భార్య అపర్ణ, తల్లి నూకరత్నం ఆరోపించారు. ఎమ్మెల్సీ చెబుతున్నట్లుగా కాకినాడలోని నాగమల్లితోట కూడలిలో ఈ నెల 19న రాత్రి రోడ్డు ప్రమాదమేమీ జరగలేదని సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణ 20న స్పష్టం చేశారు. ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తే అన్ని వేళ్లూ అనంతబాబు వైపే చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాల్సిన పోలీసులు ఆ జోలికే వెళ్లలేదు. ఈ నెల 20న తుని, పిఠాపురంలలో పెళ్లిళ్లు, మరికొన్ని వేడుకలకు అనంతబాబు హాజరైనా.. 21, 22 తేదీల్లోనూ ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నా పోలీసులు అరెస్టు చేయలేదు. మంత్రివర్గంలో అత్యంత సీనియర్ అయిన మంత్రి బొత్స సత్యనారాయణ ఆయనకు వత్తాసు పలికేలా మాట్లాడారు. ‘తప్పు చేయలేదనే ధైర్యంతోనే అనంతబాబు బయట తిరుగుతుండొచ్చు’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.
ఆ వేగం.. ఇక్కడేదీ?
ఏదైనా హత్య జరిగినా, అనుమానాస్పద మృతి చోటుచేసుకున్నా అనుమానితులైన వ్యక్తుల్ని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తారు. హత్యలో వారి పాత్రపై స్పష్టత వస్తే వెంటనే అరెస్టు చేస్తారు. సుబ్రమణ్యం హత్యపై పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో సుబ్రమణ్యానిది హత్యేనని స్పష్టత వచ్చినా వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు. కాకినాడలోని సర్పవరం పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి వెదురుపాక రాంబాబు (37) అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో అన్నవరపు లోవరాజు అనే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమైన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఎమ్మెల్సీ నిందితుడిగా ఉన్న కేసు విషయంలో జాప్యం చేయటానికి రాజకీయ పలుకుబడే కారణమన్న విమర్శలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్