Yoga: యోగా మార్గం.. ఆరోగ్య భాగ్యం
బాల్యంలోనే ఊబకాయం.. 20-30 ఏళ్లు దాటకుండానే అధిక రక్తపోటు.. పని ఒత్తిడి.. నిద్రలేమి.. ఇవన్నీ ఈతరం ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలు. దీనికి మూల కారణాలను విశ్లేషిస్తే.. ఉరుకుల పరుగుల జీవితం. బడికెళ్లే దశ నుంచే ఒత్తిడి.
యోగాసనాల సాధనతో మెరుగైన జీవనం
ప్రాణవాయువు లభ్యత అధికం
ఊబకాయం, అధిక రక్తపోటు దూరం
బాల్యం నుంచే అలవాటు మేలంటున్న నిపుణులు
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఈనాడు - హైదరాబాద్
బాల్యంలోనే ఊబకాయం.. 20-30 ఏళ్లు దాటకుండానే అధిక రక్తపోటు.. పని ఒత్తిడి.. నిద్రలేమి.. ఇవన్నీ ఈతరం ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలు. దీనికి మూల కారణాలను విశ్లేషిస్తే.. ఉరుకుల పరుగుల జీవితం. బడికెళ్లే దశ నుంచే ఒత్తిడి. మంచి ర్యాంకులు సాధించాలనే పోటీతత్వం. కంప్యూటర్ గేములకు పరిమితం కావడం. ముఖ్యంగా 8 నుంచి 12వ తరగతి వరకూ చదువు కత్తిమీద సాములా మారడం. ఇంకా విద్యాభ్యాసం ఒత్తిడిని తట్టుకోలేక కౌమార దశలోనే మానసిక సమస్యల బారినపడుతున్నారు. ఉద్యోగంలో చేరినా కంప్యూటర్ ముందు సుదీర్ఘ సమయం కూర్చొని చేసే ఉద్యోగాలతో ఊబకాయులు పెరుగుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడటానికి యోగాసనాలు చక్కగా ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు. అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
జీవనశైలి జబ్బులను నివారించే ఆసనాలు
వజ్రాసనం
కాళ్లను మడిచి, మోకాళ్లు నేలకు తాకేలా కూర్చోవాలి. అరికాళ్లు బయటకు, పాదాల పైభాగం నేలకు తాకేలా ఉండాలి. రెండు కాళ్ల బొటనవేళ్లు ఒక దానితో ఒకటి తాకాలి. పిరుదులు మడమలకు తాకేలా కూర్చోవాలి. రెండు చేతులను మోకాళ్లపై ఉంచాలి. కొద్దిసేపు కూర్చున్న తర్వాత తిరిగి సాధారణ స్థితికి రావాలి.
వృక్షాసనం
కాళ్ల మధ్య ఎడం రెండు ఇంచులుంచాలి. ఎదురుగా ఏదో ఒక వస్తువుపైనో, చిత్రంపైనో దృష్టిని కేంద్రీకరించాలి. గాలిని బిగబట్టి కుడికాలి పాదాన్ని ఎడమ కాలి తొడపై వేసుకోవాలి. గాలిని వదులుతూ రెండు చేతులను పైకి గాల్లోకి నమస్కార ముద్రలో లేపాలి. 10-30 సెకన్ల పాటు ఇలా ఉంటూ సాధారణ స్థితిలో గాలిని పీల్చుకోవాలి. అనంతరం గాలిని మెల్లగా వదులుతూ చేతులను కిందకు దించాలి. పాదాన్ని కూడా సాధారణ స్థితికి తీసుకురావాలి. ఇదే విధంగా ఎడమ కాలి పాదాన్నీ కుడి తొడపైకి తీసుకొచ్చి, చేతులను నమస్కార ముద్రలోకి తెచ్చి ఆసనాన్ని పూర్తి చేయాలి.
నడుము సమస్యల నివారణకు..
రెండు కాళ్లకు మధ్య 2-3 అడుగుల దూరాన్ని ఉంచాలి. చేతులు రెండింటిని సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా నడుమును ఎడమ వైపునకు వంచాలి. అప్పుడు కుడిచేయి ఎడమ భుజాన్ని తాకాలి. అలా కొద్దిసేపు ఉంచిన అనంతరం నెమ్మదిగా దానికి వ్యతిరేక దిశలో కుడి వైపునకు చేతులను తిప్పుతూ నడుమును వంచాలి. ఈ దశలో వెనక్కి తిరిగినప్పుడు ఎడమ చేయి కుడి భుజాన్ని తాకాలి. నడుమునొప్పి బాధితులు ఈ ఆసనం వేయకూడదు.
మోకీలు, తుంటి కీలు సమస్యలకు..
చేతులు రెండూ ముందుకు చాచాలి. ఈ దశలో అరచేతులు భూమిని చూస్తున్నట్లుండాలి. మోకాళ్లను కొద్దిగా వంచి గాల్లోనే కూర్చోవాలి. అలా కూర్చునే దశకు ముందు మెల్లగా గాలిని పీల్చుకోవాలి. ఆసనం ముగిసేటప్పుడు నిదానంగా గాలిని వదిలేయాలి.
త్రికోణాసనం
రెండు కాళ్ల మధ్య 3 అడుగుల దూరం ఉండాలి. రెండు చేతులను సమాంతరంగా లేపాలి. కుడి చేతిని కుడి పాదంపై ఉంచి, ఎడమచేతిని గాల్లో పైకి లేపాలి. తలను గాల్లో ఎడమ చేతి వైపునకు తిప్పాలి. అలా 10-30 సెకన్ల పాటు ఉండాలి. తర్వాత సాధారణ స్థితికి వచ్చి, ఇదే తీరుగా ఎడమవైపునకు కూడా చేయాలి.
పాద హస్తాసనం
రెండు పాదాల మధ్య 2 అడుగుల దూరం ఉంచాలి. గాలిని నెమ్మదిగా పీల్చుతూ రెండు చేతులను గాల్లోకి లేపాలి. గాలిని నెమ్మదిగా వదిలేస్తూ నడుమును వంచుతూ రెండు చేతులతో రెండు కాళ్ల మునివేళ్లను తాకాలి. అలా 10-30 సెకన్ల పాటు చేయాలి. ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకోవాలి.
అర్ధచక్రాసనం
రెండు కాళ్ల మధ్య ఎడం రెండు ఇంచులుంచాలి. రెండు చేతులతో నడుమును పట్టుకోవాలి. ఇప్పుడు తలను నెమ్మదిగా సాధ్యమైనంత వెనక్కి వంచాలి. అలా 10-30 సెకన్ల పాటు ఉండాలి. గాలి పీల్చుతూ సాధారణ స్థితికి రావాలి.
నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ అవసరం
-డాక్టర్ ఎ.మాలతి శ్యామల, సంచాలకులు, వేమన యోగా పరిశోధన సంస్థ
పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, పని ప్రదేశాలన్నింటిలోనూ దాదాపుగా కుర్చీల్లో కూర్చుని పనిచేయడం అలవాటైంది. దీనివల్ల రక్తప్రసరణ వ్యవస్థపై దుష్ప్రభావం పడి, 40-50 ఏళ్లు వచ్చేసరికే అధిక రక్తపోటు బారినపడుతున్నారు. కండరాలపై ఒత్తిడి అధికమైనప్పుడు అవి కుంచించుకుపోతాయి. తద్వారా శుద్ధి చేసే మార్గాలు సన్నబడతాయి. ఫలితంగా మలినాలు పూర్తిగా బయటకు పోవు. ఇది దేహంపై దుష్ప్రభావం చూపుతుంది. అందుకే త్వరగా జుట్టు నెరవడం, తొందరగా మోకాళ్లు అరగడం, రక్తహీనత, విటమిన్ డి లోపం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నిపుణుల పర్యవేక్షణలో శిక్షణతో బాల్యం నుంచే యోగాసనాలు క్రమం తప్పకుండా వేయడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నడుము నొప్పి, ఊబకాయం, వెన్నునొప్పి, అజీర్తి, హైబీపీ వంటి సమస్యల బారినపడకుండా జాగ్రత్తపడొచ్చు.
గంట కూర్చుంటే ఓ సిగరెట్ కాల్చినట్టే
-ఆచార్య డాక్టర్ సత్యలక్ష్మి, డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి, పుణె
గంటలు గంటలు కూర్చోవాల్సి వచ్చినప్పుడు.. మధ్య మధ్యలో లేచి కొద్దిసేపు అటూ ఇటూ నడవాలి. దీంతో ప్రాణవాయువును బాగా పీల్చుకోగలుగుతాం. అందుకే మనం చురుగ్గా కదులుతూ ఉండాలి. ఇటీవల ఒక అధ్యయనంలో గంటసేపు కదలకుండా కూర్చుంటే.. ఒక సిగరెట్ తాగినంత నష్టం వస్తుందని పేర్కొన్నారు. సాధారణ స్థితిలో మనం ఒక్కసారి గాలిని పీల్చినప్పుడు 500 ఎంఎల్ ఆక్సిజన్ను తీసుకుంటాం. అందులో 20 శాతం(100 ఎంఎల్) మన మెదడుకే వెళ్తుంది. ఇలా మనం ప్రతి నిమిషానికి 14సార్లు వాయువును పీల్చుకుంటాం. అంటే ప్రతి నిమిషానికి 1400 ఎంఎల్ ఆక్సిజన్ మెదడుకే వెళ్తుంది. అదే మనం ఆసనాలు, వ్యాయామాలు చేస్తున్నప్పుడు మన మెదడుకు మరింత ఎక్కువగా ప్రాణవాయువు అందుతుంది. ఇది ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!