Andhra News: ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
సబ్స్టేషన్లో భద్రతా వ్యవస్థలు పని చేయకపోవడమే శ్రీసత్యసాయి జిల్లాలో గురువారం జరిగిన విద్యుత్ ప్రమాదానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యుత్ తీగలు తెగి
రెండంచెల భద్రతా వ్యవస్థ వైఫల్యం లేదా?
విద్యుత్ ప్రమాదంపై నిపుణుల సందేహాలు
ఈనాడు, అమరావతి: సబ్స్టేషన్లో భద్రతా వ్యవస్థలు పని చేయకపోవడమే శ్రీసత్యసాయి జిల్లాలో గురువారం జరిగిన విద్యుత్ ప్రమాదానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యుత్ తీగలు తెగి రహదారిపై వెళ్తున్న ఆటోపై పడిన ఈ దుర్ఘటనలో.. క్షణాల్లో మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనమయ్యారు. సాధారణంగా తీగలు తెగిపడితే వెంటనే ఎర్తింగ్ అవుతుంది. వెన్వెంటనే 11 కేవీ సబ్స్టేషన్లోని బ్రేకర్లు వాటంతట అవే పనిచేసి లైన్లకు సరఫరా నిలిచిపోతుంది. ఇదంతా రెప్పపాటులో జరిగిపోతుంది. ఏదైనా సాంకేతిక సమస్యతో 11 కేవీ సబ్స్టేషన్లలోని బ్రేకర్లు పనిచేయకుంటే.. 33 కేవీ సబ్స్టేషన్లోని బ్రేకర్లు పనిచేయాలి. ఇలా రెండు దశల్లో భద్రతా వ్యవస్థలను డిస్కంలు ఏర్పాటు చేశాయి. తాజా ఘటనలో వీటిలో ఏ ఒక్కటి పనిచేసినా, విద్యుత్ సరఫరా ఆగిపోయి కూలీల ప్రాణాలు నిలిచేవి.
ఉడత వల్లేనంటే నమ్మశక్యమా?
‘విద్యుత్ వైర్లపై ఉడత వెళ్లింది. ఈ సమయంలో ఎర్తింగ్ అయ్యి, సహజంగా ఏర్పడే ఉష్ణోగ్రతకు వైర్లు తెగిపడ్డాయి..’ ఇదీ దుర్ఘటనపై అధికారులు చెబుతున్న మాట. షాక్కు గురైతే ఉడత చనిపోతుంది. చాలాచోట్ల విద్యుత్ లైన్లపై కోతులు, పక్షులు పడి చనిపోతుంటాయి. మనుషులూ తీగలకు తగిలి కాలిపోతుంటారు. అలాంటప్పుడు ఉడత కారణంగా ప్రమాదం జరిగిందంటే నమ్మశక్యంగా లేదని నిపుణులు పేర్కొంటున్నారు. తాజా ప్రమాదం సంభవించింది 11 కేవీ లైన్లలో. సుమారు 12 లీడ్ల మెలికతో ఈ వైర్లు ఉంటాయి. వైర్లు తెగిపడానికి ముందు అక్కడ మంటలు వచ్చి ఉండాలి. అలాంటి పరిస్థితి లేదని స్థానికులు చెప్పారు. ఉడత తోక భాగంలోని వెంట్రుకలు కొంచెం కాలినట్లు గుర్తించారు. తీగలు తెగిపడేంత ఉష్ణోగ్రత వచ్చినప్పుడు ఉడత ఎందుకు కాలిపోలేదన్నది ప్రశ్న. వైర్లు తెగేంత మంటలు వచ్చినప్పుడు ఇన్సులేటర్ దగ్గర కాలిన ఆనవాళ్లు లేవు. వీటిని బట్టి సాంకేతిక, నిర్వహణ లోపాలే ప్రమాదానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర విద్యుత్ తీగ తెగి బైక్పై వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములు నాగేంద్ర, ఫణీంద్ర మృతిచెందారు. ఇక్కడా తీగలు తెగి పడటానికి కారణం ఏంటన్నది తేల్చాలి.
భద్రతా ప్రమాణాలను విస్మరించడమే
డిస్కంలు భద్రతా ప్రమాణాలను పాటించకపోవడమే తరచూ ప్రమాదాలకు కారణంగా మారింది. బ్రేకర్లలో సాంకేతిక సమస్యలు వస్తే అవసరమైన విడిభాగాలను డిస్కంలు అందించడం లేదని సమాచారం. పాడైన వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడానికి వీలుగా అదనపు బ్రేకర్లు అందుబాటులో లేవు. 11 కేవీ సబ్స్టేషన్ నుంచి వెళ్లే 3 లైన్లకు వేర్వేరుగా బ్రేకర్లు అమర్చాలి. కొరత కారణంగా కొన్నిచోట్ల ఒకటే అమర్చి గ్రూపింగ్ చేస్తున్నారు. విద్యుత్ లైన్లను చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ అధికారులు తనిఖీచేసి భద్రతాపరమైన సూచనలు చేస్తుంటారు. వీటి అమలుకు ప్రతి డిస్కం రూ.10 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని ఏపీఈఆర్సీ సూచించినా డిస్కంలు ఆ పని చేయలేదు.
నిర్వహణపై పర్యవేక్షణలేమి
ఏటా వర్షాకాలానికి ముందు డిస్కంలు లైన్ల నిర్వహణ, మరమ్మతులు చేపడతాయి. కిందికి జారిన తీగలను సరిచేయడం, పాడైన స్తంభాల స్థానంలో కొత్తవి పాతడం, తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడం వంటి పనులు చేస్తారు. ప్రతినెలా లైన్ల నిర్వహణ ప్రక్రియ ఉంటుంది. ఈ పనులపై అధికారుల పర్యవేక్షణ లోపించిందన్నది ఆరోపణ. విద్యుత్ చట్టం ప్రకారం ప్రతి 650 సర్వీసుల పర్యవేక్షణకు ఒక జూనియర్ లైన్మన్ (జేఎల్ఎం)ను నియమించాలి. ప్రస్తుతం ఒక్కో జేఎల్ఎం ఐదారు వేల కనెక్షన్లను పర్యవేక్షిస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో జేఎల్ఎం గ్రేడ్-2 కింద సిబ్బందిని నియమించినట్లు చెబుతున్నా.. సగం సచివాలయాల్లో లేరు. గృహ విద్యుత్ కనెక్షన్లు సుమారు 1.45 కోట్లకు చేరగా, ఆ మేరకు సిబ్బంది లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?