మొర వినుమా.. గోవిందా!
రాష్ట్ర భవిష్యత్తు కోసం సిరులు పండే పొలాలను అప్పగించిన అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో అపూర్వ స్పందన లభించింది.
ద్వారకా తిరుమలలో కోలాహలంగా అమరావతి రైతుల మహాపాదయాత్ర
ఈనాడు డిజిటల్, ఏలూరు, న్యూస్టుడే- ద్వారకా తిరుమల, కామవరపుకోట: రాష్ట్ర భవిష్యత్తు కోసం సిరులు పండే పొలాలను అప్పగించిన అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో అపూర్వ స్పందన లభించింది. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న నినాదం మిన్నంటింది. అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 19వ రోజు దెందులూరు మండలం పెరుగుగూడెంలో శుక్రవారం ఉదయం తొమ్మిదింటికి ప్రారంభమైంది. యాత్రకు వచ్చిన జనంతో మెట్టపంగిడిగూడెం, పంగిడి, గొల్లగూడెం, ద్వారకాతిరుమల వరకు రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. పెరుగుగూడెం నుంచి యాత్ర మెట్టపంగిడిగూడెం వచ్చేసరికి చుట్టుపక్కల గ్రామాలవారంతా భారీగా చేరుకున్నారు. రైతులు వస్తున్న మార్గంలో ముందుగానే పూలు చల్లారు. ప్రతి గ్రామంలో మహిళలు ఎదురొచ్చి గుమ్మడి, కొబ్బరికాయలతో రైతులకు దిష్టి తీశారు. స్థానికులు చుట్టుపక్కలున్న భవనాలపైకి ఎక్కి పూలవర్షం కురిపించారు.
పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు ఏర్పాటుచేసి ప్రదర్శనగా పాదయాత్రలో కలిశారు. పరిసర ప్రాంతాల ప్రజలు ట్యాంకర్లతో పసుపునీరు తెచ్చి పంగిడి నుంచి ద్వారకాతిరుమల చేరేవరకు దారి పొడవునా పోస్తూ స్వాగతం పలికారు.
గుంతల దారుల్లో... గోవిందుడి స్మరణతో
మెట్టపంగిడిగూడెం ప్రారంభం నుంచి రహదారులు అధ్వానంగా ఉన్నాయి. గురువారం కురిసిన వర్షానికి చెరువులను తలపించాయి. ప్రజలకు అవసరమైన రహదారులు నిర్మించలేని ప్రభుత్వం మూడు రాజధానులను ఎలా ఏర్పాటుచేస్తుందని రైతులు ధ్వజమెత్తారు. ఛిద్రమైన దారుల్లో నడుస్తూ.. ముందుకు సాగారు. ద్వారకా తిరుమల ప్రవేశద్వారం వద్ద రైతులంతా కలిసి మోకాళ్లపై నిల్చొని సాష్టాంగ నమస్కారాలు చేశారు. పాదయాత్రకు సంఘీభావంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన కాకతీయ సేవాసమితి వారు రూ.లక్ష విరాళం ప్రకటించారు. జగ్గయ్యపేట నుంచి రెండు బస్సుల్లో మహిళా రైతులు వచ్చారు. ద్వారకా తిరుమల మండలం మారంపల్లికి చెందిన మహిళా కోలాట బృందం గొల్లగూడెం నుంచి కోలాటమాడుతూ యాత్రలో పాల్గొంది. దళిత ఐకాస, దళిత బహుజన ఐకాస నాయకులు మద్దతు పలికారు. రాజమహేంద్రవరం జీఎస్ఎల్ వైద్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ మంత్రులు పీతల సుజాత, జవహర్, తెదేపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీ మాగంటి బాబు, జడ్పీ మాజీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ముప్పిడి వెంకటేశ్వరరావు యాత్రలో పాలొన్నారు..
19వ రోజు యాత్ర ఇలా..
* ప్రారంభం: దెందులూరు మండలం పెరుగుగూడెం
* ముగింపు: ద్వారకా తిరుమల
* నడిచిన దూరం: 15 కిలోమీటర్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ