సంక్షిప్త వార్తలు (9)
గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇతర భవన నిర్మాణాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన సిమెంట్ వినియోగంపై నిఘా-అమలు విభాగం (విజిలెన్స్) విచారణ చేస్తోంది.
సిమెంట్ దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ
భవన నిర్మాణాలకు ఇచ్చిన నిల్వలు పక్కదారి
ఈనాడు-అమరావతి: గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇతర భవన నిర్మాణాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన సిమెంట్ వినియోగంపై నిఘా-అమలు విభాగం (విజిలెన్స్) విచారణ చేస్తోంది. కొన్ని జిల్లాల్లో సిమెంట్ పక్కదారి పట్టిందన్న ఫిర్యాదులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఇచ్చిన ప్రాథమిక సమాచారంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అధికారులు విచారణ చేశారు. అన్ని జిల్లాల్లోనూ విచారణ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందనుంది.
రెవెన్యూలోటు కింద ఏపీకి రూ.879 కోట్లు
ఈనాడు, దిల్లీ: రెవెన్యూలోటు భర్తీ గ్రాంట్ ఏడో విడత కింద కేంద్ర ఆర్థికశాఖ గురువారం ఆంధ్రప్రదేశ్కు రూ.879.08 కోట్లు విడుదల చేసింది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.6,153.58 కోట్లు విడుదల చేసినట్లయింది. 15వ ఆర్థికసంఘం ఈ ఆర్థిక సంవత్సరంలో 14 రాష్ట్రాలకు కలిపి రూ.86,201 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఇప్పటివరకు ఆరు విడతల్లో రూ.50,282.92 కోట్లు విడుదల చేసిన ఆర్థికశాఖ 7వ విడత కింద రూ.7,183.42 కోట్లు ఇచ్చింది. ఇందులో ఏపీకి రూ.879.08 కోట్లు దక్కింది.
తిరుగు ప్రయాణాలకు 2,400 బస్సులు
ఈనాడు, అమరావతి: దసరా పండుగ, సెలవులకు సొంతూళ్లకు వచ్చినవారి తిరుగు ప్రయాణాలకు వీలుగా ఏపీఎస్ఆర్టీసీ 2,400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 10 వరకు వీటిని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య నడిపేలా సన్నాహాలు చేసింది.
తెలుగుయువత గుంటూరు జిల్లా అధ్యక్షుడిపై సీఐడీ కేసు?
గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే: తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే అభియోగంపై పలువురి మీద కేసు పెట్టారు. ఇందులో రావిపాటి సాయికృష్ణను ఏ2గా పేర్కొన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు డీడీవో అధికారాలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 163 ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారాలను (డీడీవో) బదలాయించేందుకు ట్రెజరీ డైరెక్టర్ గురువారం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ ఉత్తర్వుల వల్ల జీతాలు, సెలవుల మంజూరు అధికారాలు ఇకనుంచి ప్రిన్సిపాళ్లకు ఉంటాయి.
‘ఉత్తీర్ణత మినహాయింపుతో ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి’
ఈనాడు-అమరావతి: సర్వే ట్రైనింగ్లో ఉత్తీర్ణత నుంచి మినహాయింపునిస్తూ గ్రేడ్-2 వీఆర్వోలకు ప్రొబేషన్ పీరియడ్ను ప్రకటించాలని ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్కు భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్కు గురువారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. ప్రొబేషన్ ప్రకటనలో ఆలస్యం జరిగితే వీఆర్వోలు సీనియారిటీ తదితర విషయాల్లో తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేసింది. పని ఒత్తిడి తగ్గించేలా వీఆర్వోల జాబ్చార్టులో మార్పులు చేయాలని కోరింది.
నేడు పోలవరంపై సాంకేతిక కమిటీల సమావేశం
నాలుగు రాష్ట్రాలతో దిల్లీలో భేటీకానున్న సీడబ్ల్యూసీ
ఈనాడు, హైదరాబాద్: పోలవరంపై శుక్రవారం దిల్లీలో నాలుగు రాష్ట్రాలతో కేంద్ర జల సంఘం సమావేశం కానుంది. గత నెల 29న కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సాంకేతిక కమిటీలు పాల్గొననున్నాయి. తెలంగాణ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ నేతృత్వంలో ఓ అండ్ ఎం ఈఎన్సీ నాగేందర్రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్రెడ్డి, అంతరాష్ట్ర జల వనరుల విభాగం ఈఈ సుబ్రహ్మణ్య ప్రసాద్, తదితరులు పాల్గొంటున్నారు. ఏపీ నుంచి జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి నేతృత్వంలో పోలవరం సీఈ సుధాకర్బాబు, ఎస్ఈ నర్సింహమూర్తి, తదితరులు హాజరవుతున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక జాబితా సిద్ధం!
ఈనాడు, అమరావతి: 376 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి గత ఆగస్టు నెలలో జారీచేసిన నోటిఫికేషన్ అనుసరించి ఎంపికచేసిన అభ్యర్థుల జాబితా విడుదలకు సిద్ధమైంది. ఎంపికచేసిన వారికి శనివారం నుంచి పోస్టింగ్ కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఇన్ఛార్జి డీఎంఈ వినోద్ తెలిపారు.
శాప్లోనూ కారుణ్య నియామకాలకు అనుమతి
ఈనాడు-అమరావతి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో మొదటిసారి కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను సడలిస్తూ రాజపత్రం వెలువడింది. మిగతా ప్రభుత్వ శాఖల్లో మాదిరిగా శాప్లోనూ విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించే వెసులుబాటు కల్పించాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM